Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీ సర్కారు జీతాలివ్వలేకుంది.. ఆ నిధులిచ్చేయండి : జైట్లీకి వెంకయ్య వినతి

Webdunia
సోమవారం, 31 ఆగస్టు 2015 (13:38 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. ఈ కష్టాల నుంచి గట్టెక్కించేందుకు తెరాస ప్రభుత్వంతో పాటు... ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావులు చేసిన ప్రయత్నాలు ఏ ఒక్కటీ ఫలించలేదు. దీంతో తెలంగాణ ప్రభుత్వ కేంద్రమంత్రి వెంకయ్య నాయుడిని ఆశ్రయించింది. 
 
ఆ వెంటనే రంగంలోకి దిగిన వెంకయ్య.. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో చర్చించారు. తెలంగాణ సర్కారు నుంచి లాగేసుకున్న నిధులను తక్షణమే ఆ రాష్ట్రానికి ఇవ్వాలని ఆయన జైట్లీని కోరారు. దీనికి స్పందించిన జైట్లీ రెండు రోజుల్లోగా ఆ నిధులను తెలంగాణ ఖాతాకు జమ చేస్తామని వెంకయ్యకు హామీ ఇచ్చారు. 
 
ఫలితంగా తెలంగాణ ఖాతా నుంచి కేంద్రం లాగేసుకున్న రూ.1,250 కోట్ల నిధులు ఎట్టకేలకు తిరిగి ఆ రాష్ట్రానికి రానున్నాయి. ఈ నిధులను పన్ను చెల్లింపులో జాప్యాన్ని కారణంగా చూపుతూ కేంద్రం ముందస్తు సమాచారం లేకుండానే లాగేసుకున్న విషయం తెల్సిందే. దీంతో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తారుమారైంది. రెండు నెలల పాటు ఉద్యోగుల వేతనాల చెల్లింపులకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఉద్యోగుల వేతనాలు మినహా ఏ ఇతర ఖర్చులకు కూడా నిధులు విడుదల చేయరాదని కూడా ప్రభుత్వం ఆయా శాఖలకు తేల్చిచెప్పింది. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments