Webdunia - Bharat's app for daily news and videos

Install App

టోల్‌ప్లాజా వద్ద నిందితుడి పోలికలతో ఉన్న వ్యక్తి..? రాజు అతడేనా?

Webdunia
బుధవారం, 15 సెప్టెంబరు 2021 (18:56 IST)
హైదరాబాద్ నగరంలోని సింగరేణి కాలనీకి చెందిన చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి హతమార్చిన కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఎవరు గుర్తుపట్టకుండా ఉండటానికి నిందితుడు మారు వేషాలతొ తిరిగే అవకాశం ఉన్నందున, జుత్తు, గడ్డం వంటి మార్పులతో నిందితుని పోలి ఉండే చిత్రాలను విడుదల చేశారు. నిందితుడు రాజుని పట్టిస్తే పదిలక్షల రివార్డును కూడా ప్రకటించింది హైదరాబాద్ పోలీస్. 
 
టెక్నికల్‌గా సీసీటీవీలను కనెక్ట్‌ చేసుకుంటూ వెళ్తున్నారు పోలీసులు. ఇప్పటికే బస్టాండ్స్‌, రైల్వే స్టేషన్లలో చెకింగ్‌ను ముమ్మరం చేశారు. ఎల్బీనగర్‌కు కనెక్ట్‌ అయ్యే అన్ని హైవేలను జల్లెడపడుతున్నారు. 
 
వరంగల్‌ హైవే, విజయవాడ హైవే, సాగర్‌, శ్రీశైలం హైవేల్లో గాలింపు చేపట్టారు. అయితే, ఇదే క్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల మండలం పంతంగి టోల్ ఫ్లాజాను దాటుకుంటూ నిందితుడు వెళ్లినట్లు సీసీ ఫుటేజ్‌లో రికార్డు అయ్యింది. 
 
అచ్చం నిందితుడి పోలికలతో కూడిన వ్యక్తి జాతీయ రహదారి వెంబడి నడుచుకుంటూ వెళ్తున్నట్లు సీసీ ఫుటేజ్‌ల్లో కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments