Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటుకు నోటు కేసు: మత్తయ్యకు టీఏసీబీ హామీ.. నోటీసులే.. అరెస్ట్ చేయం!

Webdunia
శనివారం, 13 ఫిబ్రవరి 2016 (10:06 IST)
ఓటుకు నోటు కేసులో విచారణలో హాజరుకావాలంటూ ఈ కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న జెరూసలెం మత్తయ్యకు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణ ఏసీబీ అధికారులు ఓ కీలక అంశాన్ని ప్రస్తావించారు. తాజాగా శుక్రవారం ఈ కేసు ఫైలు బూజు దులిపిన టీ ఏసీబీ, విచారణకు హాజరుకావాలంటూ ఉప్పల్‌లోని మత్తయ్యకు నోటీసులు జారీ చేసింది. 
 
విచారణకు పిలిచి ఎక్కడ అరెస్ట్ చేస్తారోనన్న భయంలో మళ్లీ మత్తయ్య ఏపీ పారిపోవచ్చని భావించిన ఏసీబీ అధికారులు... ఆ నోటీసుల్లో ఓ కీలక అంశాన్ని ప్రస్తావించారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు మిమ్మల్ని అరెస్ట్ చేయబోమని ఏసీబీ మత్తయ్యకు హామీ ఇచ్చింది. అంతేకాక న్యాయవాదితో కలిసి విచారణకు రావచ్చని కూడా ఆయనకు తెలిపింది.
 
ఈ కేసు వెలుగు చూసిన వెంటనే అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు మత్తయ్య ఏపీకి తరలివెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచే మత్తయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకుని తన అరెస్ట్‌ను నిలువరించుకున్నారు. ఆ తర్వాత కాని ఆయన హైదరాబాదులో అడుగుపెట్టలేదు.

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

Show comments