Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీఆర్ఎస్ ఎంపీ కవితపై బీజేపీ నేత కోర్టులో కేసు!

Webdunia
గురువారం, 31 జులై 2014 (09:41 IST)
తెలంగాణ, జమ్మూకాశ్మీర్ ప్రాంతాలపై టీఆర్ఎస్‌కు చెందిన నిజామాబాద్ ఎంపీ కె కవిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బీజేపీ నేత కాశింశెట్టి కరుణాసాగర్ హైదరాబాద్‌ కోర్టులో ఒక ప్రైవేట్ పిటీషన్ దాఖలు చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కె కవిత మాట్లాడుతూ.. తెలంగాణ, జమ్మూకాశ్మీర్‌ల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 
 
భారతదేశానికి స్వాతంత్యం వచ్చిన తర్వాత తెలంగాణ, జమ్మూకాశ్మీర్ ప్రాంతాలను బలవంతంగా ఇండియన్ యూనియన్‌లో కలిపారంటూ అనుచితంగా వ్యాఖ్యానించిన ఎంపీ కవితపై ఐపీసీ సెక్షన్ 124(ఎ), 153(బి), 505ల కింద కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బీజేపీ లీగల్ సెల్ గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ కాశింశెట్టి కరుణాసాగర్ హైదరాబాదులోని ఏడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు. అయితే, మెజిస్ట్రేట్ ఈ కేసు విచారణను ఆగస్టు ఒకటో తేదీకి వాయిదా వేశారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments