Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కుమార్తెపై కేసు నమోదు.. తండ్రే పెట్టించారంటున్న కుమార్తె

Webdunia
మంగళవారం, 27 జూన్ 2023 (13:16 IST)
తెలంగాణ రాష్ట్రంలోని అధికార భారత రాష్ట్ర సమితికి చెందిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కుమార్తె తుల్జా భవానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తన భూమి ఫెన్సింగ్‌ను భవానీ కూల్చివేశారంటూ పక్క స్థల యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. దీనిపై తుల్జా భావనీ స్పందిస్తూ, తన తండ్రే ఆయనతో కేసు పెట్టించారని ఆరోపిస్తున్నారు.
 
జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే యాదగిరి రెడ్డికి, ఆయన కుమార్తె తుల్జా భవానీ రెడ్డికి మధ్య గత కొంతకాలంగా భూమికి సంబంధించిన వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో 1270 గజాల స్థలం చుట్టూత ఉన్న ఫెన్సింగ్‌ను తుల్జా భవానీ సోమవారం కూల్చివేశారు. తన పేరుమీద ఉన్న భూమి చుట్టూ ఉన్న ప్రహరీ గోడను ఆమె కూల్చేవేశామని చెబుతున్నారు. 
 
పైగా, చేర్యాల మున్సిపాలిటీకి తన భూమిని అప్పగించనున్నట్టు ఆమె ప్రకటించారు. అయితే, ఆ భూమి పక్కన ఉన్న తన భూమి ఫెన్సింగ్‌ను కూడా భవానీ కూల్చివేశారంటూ పక్క స్థల యజమాని రాజు భాయ్ చేర్యాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా చేసుకుని తుల్జా భవానీపై పోలీసులు నమోదు చేశారు. దీనిపై భవానీ స్పందిస్తూ, తన తండ్రి ఒత్తిడి రాజు భాయ్ తనపై ఫిర్యాదు చేసి, పోలీసులు కేసు పెట్టేలా చేశారని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జియో సినిమా ప్రీమియంలో ఈనెల‌ 15న కుంగ్ ఫూ పాండా 4

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments