Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్. షర్మిళ కాన్వాయ్‌లో ప్రమాదం.. నలుగురికి గాయాలు...

Webdunia
శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (12:12 IST)
వైఎస్ఆర్ పుత్రిక వైఎస్. షర్మిల కొత్త పార్టీ ఆవిష్కరణ సభ శుక్రవారం ఖమ్మంలో జరుగనుంది. ఇందుకోసం ఖమ్మం వెళుతోన్న వైఎస్ షర్మిల కాన్వాయ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. నాలుగు వాహనాలు ఢీకొని పలువురికి గాయాలయ్యాయి. 
 
శుక్రవారం సాయంత్రం 5 గంటలకు వైఎస్‌ షర్మిల సంకల్ప సభ జరగనుంది. ఇందుకోసం ఈ ఉదయం హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని నివాసం నుంచి ఖమ్మం సభకు భారీ కాన్వాయ్‌తో బయల్దేరారు. 
 
అయితే, మార్గమధ్యలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంటకు షర్మిల ఖమ్మం చేరుకోవాల్సి ఉంది. శుక్రవారం జరిగే సంకల్ప సభలో వైఎస్‌ విజయమ్మ పాల్గొని షర్మిలను ఆశీర్వదిస్తారు. అటు, ఈ సభకు ఖమ్మం జిల్లాతో పాటు తెలంగాణలోని మిగతా జిల్లాల నుంచి భారీగా వైఎస్‌ అభిమానులు తరలివస్తున్నారు. 
 
సంకల్పయాత్రకు బయల్దేరే ముందు షర్మిల ఆమె భర్త అనిల్ ఆశీర్వాదం తీసుకున్నారు. తనకు అన్నివిధాలా తోడ్పాటునందిస్తున్నందుకు ఆమె అనిల్‌కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments