Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్చి 15న హైదరాబాద్‌లో సీఏఏ అనుకూల సభ

Webdunia
సోమవారం, 24 ఫిబ్రవరి 2020 (08:16 IST)
సీఎం కేసీఆర్‌ ఎన్నికల తర్వాత మాటమార్చి ఉద్యోగులను మోసం చేశారని... భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ విమర్శించారు. ఆరేళ్లలో 50 వేలకు పైగా ఖాళీలు ఏర్పడితే 20 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదన్నారు.

కల్వకుంట్ల కుటుంబంలో అందరికీ పోస్టులు దక్కాయి కానీ, నిరుద్యోగులు అలాగే మిగిలిపోయారని ఆరోపించారు. సీఏఏపై అనుమానాలు నివృత్తి చేసేందుకు వచ్చేనెల 15న హైదరాబాద్​లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు లక్ష్మణ్ తెలిపారు.

దీనికి అమిత్ షా హాజరుకానున్నారు. హైదరాబాద్‌ భాజపా కార్యాలయంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ తెరాస పాలనపై మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబంలో అందరికీ పోస్టులు దక్కాయి కానీ, రాష్ట్రంలో నిరుద్యోగులు అలాగే మిగిలిపోయారని విమర్శించారు.

ఉద్యోగులకు మధ్యంతర భృతి మరిచి... ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు. ఉద్యోగ సంఘాల నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం ఉద్యోగులు బలౌతున్నారని ఆరోపించారు. ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయకుంటే ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని అయన హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments