Webdunia - Bharat's app for daily news and videos

Install App

బావపై రంగు అనుకుని టర్పెంటాయిల్ చల్లేసిన మరదలు-పొయ్యి పక్కనే నిల్చోవడంతో బావ మృతి..

సింగరేణి కాలనీలో హోలీ పండుగ నాడు విషాధ ఘటన చోటుచేసుకుంది. బావపై మరదలు రంగు చల్లాలనుకుంది. అయితే రంగు అనుకున్న నీళ్లు టర్పెంటాయిల్ అని తెలియక బావను పొట్టనబెట్టుకున్నానని ఆ మరదలు కుమిలిపోయింది.

Webdunia
శుక్రవారం, 17 మార్చి 2017 (15:30 IST)
సింగరేణి కాలనీలో హోలీ పండుగ నాడు విషాధ ఘటన చోటుచేసుకుంది. బావపై మరదలు రంగు చల్లాలనుకుంది. అయితే రంగు అనుకున్న నీళ్లు టర్పెంటాయిల్ అని తెలియక బావను పొట్టనబెట్టుకున్నానని ఆ మరదలు కుమిలిపోయింది. వివరాల్లోకి వెళితే.. నాగర్ కర్నూల్ జిల్లా, లింగాల మండలం దేవుని తండాకు చెందిన చందర్ నాయక్ (24) అలియాస్ చందు.. సింగరేణి కాలనీలోని అతని సోదరుని ఇంట వుంటున్నాడు. 
 
బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల హోలీ పండుగ నాడు వరుసకు మరదలయ్యే బాలిక(15)తో హోలీ ఆడాడు. ఇద్దరూ రంగులు చల్లుకుంటున్న సమయంలో ఓ సీసాలోని రంగు నీటిని బావపై ఆ బాలిక చల్లింది.
 
అయితే బాలిక చల్లింది టర్పెంటాయిల్ కావడం.. ఆ సమయంలో చందర్ నాయక్ పొయ్యి పక్కన్నే నిలుచుని ఉండటంతో అతనికి మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన చందును ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ చందు ప్రాణాలు కోల్పోయాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments