సీఎం కేసీఆర్ పార్టీకి తేరుకోలేని షాకిచ్చిన లోక్‌సభ సచివాలయం

Webdunia
బుధవారం, 1 మార్చి 2023 (14:55 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని భారత రాష్ట్ర సమితికి లోక్‌సభ సచివాలయం తేరుకోలేని షాకిచ్చింది. లోక్‌సభ బీఏసీ నుంచి ఆ పార్టీ గుర్తింపును రద్దు చేసింది. బీఆర్‌ఎస్‌కు లోక్‌సభ సచివాలయం గుర్తింపును ఇవ్వలేదు. బీఆర్ఎస్‌ తరపున బిజినెస్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా ఆ పార్టీకి చెందిన ఎంపీ నామా నాగేశ్వర రావు మాత్రమే ఉన్నారు.

అయితే, బుధవారం జరిగిన లోక్‌సభ బీఏసీకి ఆయన్ను బీఆర్ఎస్ సభ్యుడిగా కూడా కేవలం ఆహ్వానితుడిగానే లోక్‌సభ సచివాలయం ఆహ్వానించింది. నిజానికి ఆరుగురు సభ్యుల కంటే ఎక్కువ మంది లోక్‌సభ సభ్యులు ఉన్న పార్టీకి బీఏసీ సభ్యత్వం ఉంటుంది. అయితే, తెరాసకు తొమ్మిది మంది సభ్యులు ఉన్నప్పటికీ ఆ పార్టీకి బీఏసీ సభ్యత్వాన్ని ఇచ్చేందుకు లోక్‌సభ సచివాలయం నిరాకరించింది.

దీంతో ఆ పార్టీ ఇకపై కేవలం ఆహ్వానిత పార్టీగానే ఉండనుంది. అంటే, లోక్‌సభ సచివాలయం ఆహ్వానిస్తేనే బీఏసీ సమావేశానికి బీఆర్ఎస్ సభ్యుడు హాజరుకావాల్సి వుంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యూత్ ఫుల్ బ్లాక్ బస్టర్ మూవీ 4 రోజుల్లో 3.73 కోట్ల రూపాయల వసూళ్లు

Satya: జెట్లీ ఫస్ట్ సింగిల్ సత్య ఈజ్ నాట్ జెట్లీ ఏప్రిల్ 2న రిలీజ్

Dr. Rajasekhar: నాకు తెలియకుండానే జీవిత ఆ బైక్ అమ్మేశారు : హీరో రాజశేఖర్

పళ్లిచట్టంబి మా డ్రీమ్ ప్రాజెక్ట్,మనందరి సినిమా కాబోతోంది - టొవినో థామస్

Vaishnavi: 2 మిలియన్లను దాటిన ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్ లోని తొలి గీతం సంచారమే.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి నిద్రకు ముందు తినకూడని ఆహార పదార్థాలు ఏమిటి?

టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు ఏమేమి తినకూడదు?

అసోసియేషన్ ఆఫ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్-తమిళనాడు చాప్టర్ భాగస్వామ్యం

రవీనా టాండన్, రాషా థడానీలతో తల్లి-కూతుళ్ల నమ్మకాన్ని వేడుక చేసిన గార్నియర్ కలర్ నాచురల్స్

మహిళల్లో రుతుక్రమం ఎందుకు ఆలస్యం, ప్రధాన కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments