Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదు, మేడ్చల్ ర్వేస్టేషన్‌లో బోగీలకు మంటలు, అప్రమత్తమైన సిబ్బంది

Webdunia
మంగళవారం, 3 నవంబరు 2020 (20:53 IST)
హైదరాబాదు నగర శివార్లలోని మేడ్చల్ రైల్వేస్టేషన్లో మంగళవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నది. రైల్వేస్టేషన్లో ప్రక్కనే నిలిపి ఉంచిన 10 బోగీలలో 2 బోగీలకు మంటలు అంటుకున్నాయి. దీంతో అప్రమత్తమైన రైల్వే సిబ్బంది అగ్నమాపకశాఖ అధికారులకు సమాచారం అందించారు.
 
ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పి అదుపులోకి తీసుకువచ్చారు. అంతకంటే ముందుగా ఒక బోగీ నుంచి మరో బోగీకి మంటలు వ్యాపించడంతో అక్కడంతా దట్టమైన పొగ అలుముకుంది. రైల్వే స్టేషన్లోనే ఈ ప్రమాదం జరగడం వలన అక్కడ ప్రయీణికులు, స్థానికులు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందారు.
 
ఈ అగ్ని ప్రమాదంపై దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వీ సీహెచ్ రాకేశ్ మాట్లాడుతూ... రెండు బోగీలకు నిప్పంటుకుందని, మంటలను అదుపులోనికి తీసుకొని వచ్చామని తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే పనిలో సంబంధిత అధికారులు నిమగ్నమైనట్టు తెలిపారు రాకేశ్.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments