ఇంట్లోకి ప్రవేశించిన నల్లత్రాచు... చిన్నారులు మాత్రమే వుండటంతో..

Webdunia
శుక్రవారం, 25 డిశెంబరు 2020 (11:42 IST)
అర్ధరాత్రి వేళ ఓ నల్లత్రాచు కలకలం రేపింది. పాము ఇంట్లో దూరిన సమయంలో కేవలం చిన్నారులు మాత్రమే ఉండటంతో వారు వారు భయంతో వణికిపోయారు. ఈ ఘటన శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కాలనీలో చోటుచేసుకుంది. వివరాలు.. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి ఎయిర్‌పోర్ట్ కాలనీలో నివాసం ఉంటే అక్బర్ అనే వ్యక్తి ఇంట్లోకి అర్ధరాత్రి వేళ నల్లత్రాచు పాము మెల్లగా దూరింది. ఇంట్లోకి దూరి హల్ చల్ చేసింది.

అయితే పాము ఇంట్లోకి వచ్చిన సమయంలో కేవలం చిన్న పిల్లలు మాత్రమే ఇంట్లో ఉన్నారు. దీంతో వారు పామును గమనించి గజగజ వణికిపోయారు. భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు. వారి కేకలు విన్న కాలనీవాసులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు.
 
నల్లత్రాచును చూసేందుకు పెద్ద సంఖ్యలో అక్బర్ నివాసం వద్దకు చేరుకున్నారు. జనాన్ని చూసిన పాము కదలకుండా అక్కడే నిలబడి పోయింది. కాసేపటికి అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో అక్కడి వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల ఖమ్మంలో బైక్‌లో నుంచి బయటపడ్డ పాము.. కొద్ది రోజుల కిందట ఖమ్మం జిల్లాలో ఓ వ్యక్తి బైక్‌లో పాము కనిపించడం కలకలం రేపిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiran Abbavaram: తిమ్మరాజుపల్లి టీవీ నుంచి నిజమేనా లిరికల్ సాంగ్

Raghu Kunche: గేదెల రాజు చిత్రంలో హీరోలు, విలన్స్ ఉండరు. పాత్రలు మాత్రమే ఉంటాయి

Thiruveer: పాపం ప్రతాప్ అన్నవాళ్లతో వీర ప్రతాప్ అనిపించుకుంటా : తిరువీర్

మేఘాంశ్ శ్రీహరి హీరోగా థ్రిల్లర్‌ కాన్సెప్ట్ తో ఆస్మాన్ చిత్రం ప్రారంభం

ప్రతీ చోటా రాకాస కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది : నిహారిక కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని పండ్లు, ఏంటవి?

హైదరాబాద్‌లో ట్రామా- ఎమర్జెన్సీ మెడిసిన్‌పై జాతీయ సదస్సును ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా

యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించే ఫుడ్స్

Tulsi water, ఖాళీ కడుపుతో తులసి నీరు తాగితే?

జింజిర్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments