Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరు నశం పెడితే మేం జండూ బామ్ రాస్తాం.. బండి సంజయ్ కౌంటర్

Webdunia
శనివారం, 12 ఫిబ్రవరి 2022 (12:52 IST)
జనగామ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ బీజేపీ ఘాటు విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఖబడ్దార్ నరేంద్ర మోదీ.. బీజేపీ బిడ్డల్లారా తెలంగాణ జోలికికొచ్చినా.. తెలంగాణ బిడ్డల జోలికొస్తే మిమ్మల్ని "నశం చేస్తాం అంటూ హెచ్చరించారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ నేతల బండి సంజయ్ అంతకంటే ఘాటుగా కేసీఆర్‌కు కౌంటరిచ్చారు. 
 
కేసీఆర్‌కు భయం పట్టుకుందని అందుకే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కచ్చితంగా కేసీఆర్ పాలనపై చర్చ జరుగుతుందని అన్నారు. మిమ్మల్ని నశం పెట్టి నలిపేస్తాం అని కేసీఆర్ వార్నింగ్ ఇస్తే దానికి బండి సంజయ్ మీరు నశం పెడితే మేం జండూ బామ్ రాస్తాం అంటూ కౌంటర్ ఇచ్చారు. బీజేపీతో పెట్టుకుంటే మాడి మసైపోతారంటూ హెచ్చరించారు. 
 
జనగామ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రంగా విరుచుకుపడ్డ సీఎం కేసీఆర్ అదే సమయంలో తెలంగాణలోని బీజేపీ నేతలు, కార్యకర్తలకు కూడా వార్నింగ్‌ ఇచ్చారు.. పిడికెడు లేని బీజేపోడు టీఆర్ఎస్ కార్యకర్తలను కొట్టాడని తెలిసింది. 
 
బీజేపీ బిడ్డల్లారా మేం మంచివాళ్లం మిమ్మల్ని ఏమీ అనం.. కానీ, మమ్మల్ని ముట్టుకుంటే నశం నశం చేస్తామంటూ వార్నింగ్‌ ఇచ్చారు. కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం.. మా శక్తి ముందర మీరు ఎంత? మేం ఊదితే అడ్రస్ లేకుండా పోతారు జాగ్రత్త అంటూ తీవ్ర హెచ్చరికలు జారీచేశారు సీఎం కేసీఆర్‌.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments