Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాను క్లస్టర్లుగా విభజించిన బీజేపీ

Webdunia
మంగళవారం, 5 జులై 2022 (16:19 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి వచ్చే యేడాది ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపొంది అధికారంలోకి రావాలని కమలనాథులు కలలుగంటున్నారు. ఇందుకోసం పక్కా ప్రణాళికతో ముందుకుసాగుతున్నారు. ఇందులోభాగంగా, తెలంగాణ రాష్ట్రాన్ని నాలుగు క్లస్టర్లుగా ఆ పార్టీ విభజన చేసింది. ఒక్కో క్లస్టర్‌కు ఒక్కో కేంద్ర మంత్రిని ఇన్‌చార్జ్‌గా నియమించింది. వీరంతా అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత కీలకంగా వ్యవహరించనున్నారు. 
 
ఎన్నికల్లో వీరు పోటీ చేయకపోయినప్పటికీ పార్టీ టిక్కెట్ల కేటాయింపు, అభ్యర్థుల ప్రచారం, బూత్ కమిటీలను బలపేతం చేయడం తదితర అంశాలను వీరు స్వయంగా పర్యవేక్షిస్తారు. తమ క్లస్టర్ పరిధిలోని పార్టీ జయాపజయాలపై నిరంతరం సమీక్ష చేస్తూ స్థానిక నేతలను ప్రోత్సహిస్తుంటారు. 
 
తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్, వరంగల్, ఆదిలాబాద్, జహీరాబాద్ పేరిట నాలుగు క్లస్టర్లుగా విభజన చేసింది. ఇందులో హైదరాబాద్ క్లస్టర్‌కు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియా ఇన్‌చార్జ్‌గా నియమించారు. అలాగే, జహీరాబాద్‌ క్లస్టర్‌కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆదిలాబాద్‌ క్లస్టర్‌కు కేంద్ర మంత్రి పురుషోత్తమ్ రూపాల, వరంగల్ క్లస్టర్‌కు రావు ఇంద్రజిత్‌ సింగ్‌ను నియమించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments