Webdunia - Bharat's app for daily news and videos

Install App

పురుగుల బిర్యానీ.. హోటల్‌ను సీజ్ చేసిన అధికారులు..

Webdunia
మంగళవారం, 3 ఆగస్టు 2021 (23:06 IST)
కాసులకు కక్కుర్తిపడి కొంతమంది హోటల్ యజమానులు జనాలకు పురుగుల బిర్యానీ విక్రయిస్తున్నారు. రెండు మూడు రోజులుగా నిల్వ ఉన్న, కుళ్లిన చికెన్‌తో బిర్యానీ వండుతున్నారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. అయితే నిర్మల్‌ జిల్లా కేంద్రంలో ఊహించని సంఘటన ఒకటి జరిగింది. బిర్యానీ తిందామని హోటల్‌కి వచ్చిన మున్సిపల్ కమిషనర్‌కి పురుగుల బిర్యానీ వడ్డించి అడ్డంగా బుక్కయ్యారు.
 
నిర్మల్ జిల్లా కేంద్రంలోని లక్ష్మి గ్రాండ్ హోటల్‌కి మునిసిపల్‌ కమిషనర్ బాలకృష్ణ, సిబ్బందితో కలిసి లంచ్‌ చేద్దామని వెళ్లారు. నాలుగు ప్లేట్ల బిర్యానీ ఆర్డర్ చేశారు. వెంటనే హోటల్‌ సిబ్బంది వేడివేడి బిర్యానీ తెచ్చి వడ్డించారు. అయితే సిబ్బందితో సహా కమిషనర్ ఒక్కసారిగా షాకయ్యారు. కారణం వారికి వడ్డించిన బిర్యానీలో పురుగులు దర్శనమిచ్చాయి. దీంతో అందరు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు.
 
వెంటనే అలర్ట్ అయిన కమిషనర్ బిర్యానీని పక్కన పెట్టి సిబ్బందితో కలిసి హోటల్‌లో తనిఖీలు చేపట్టారు. హోటల్ కిచెన్ గదిలో తనిఖీలు చేయగా ఫ్రిజ్ లో కుళ్లిన చికెన్ , కలుషిత ఆహారం బయటపడింది. ప్రిజ్‌లో ఉంచిన చికెన్ పురుగులు పట్టి ఉండటంతో మున్సిపల్ కమిషనర్ కోపం నషాళానికి అంటింది. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతారా అంటూ హోటల్‌ను సీజ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments