కేటీఆర్ ఓ తుపాకీ రాముడు

Webdunia
బుధవారం, 15 సెప్టెంబరు 2021 (07:04 IST)
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మంత్రి కేటీఆర్ పై నిప్పులు చెరిగారు."కేటీఆర్ ఓ తుపాకీ రాముడు.. అతని మాటలు ఎవరు పట్టించుకుంటారు" అని ఘాటుగా వ్యాఖ్యానించారు. యూపీఏ హయాంలో రాష్ట్రానికి 32 శాతం నిధులిస్తే, ఎన్డీయే వచ్చాక 9 శాతం పెంచి 42 శాతం ఇస్తున్నామని సంజయ్ తెలిపారు.

కేటీఆర్ ఒక అజ్ఞాని, తుపాకీ రాముడు అని అన్నారు. కేటీఆర్‌ను ఎవరు పట్టించుకుంటారని, కేసీఆర్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేసారు.

పన్నుల విషయంలో రాష్ట్రానికి, కేంద్రానికి చట్టం ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రులు పొగిడినట్లు లీకులు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. కొత్త సెక్రటేరియట్ పూర్తయ్యే సరికి ఈ ప్రభుత్వం ఉండదని ఆయన జోస్యం చెప్పారు. సచివాలయానికి వెళ్లని వాడికి కొత్తది ఎందుకని ప్రశ్నించారు.
 
ఉద్యోగి చనిపోయిన తర్వాత, పదవీ విరమణ  తర్వాత పీఆర్‌సీ ఇస్తారా, దేశంలో ఎక్కడైనా ఉందా అని ఆయన నిలదీశారు. ముఖ్యమంత్రి దిగజారి మాట్లాడుతున్నాడన్నారు. ఆర్టీసీ విషయంలో ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఆలోచించాలన్నారు.

ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌కి వెళ్లకుండా ముఖ్యమంత్రి ఎందుకు వాయిదా వేయించాడన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వ ప్రణాళిక ఏమిటి, కేంద్ర వ్యవసాయ మంత్రికి ముఖ్యమంత్రి ఎందుకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని సంజయ్ ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Satyadev :రావు బహదూర్ నుంచి సత్యదేవ్, దీపా థామస్‌ పై రొమాంటిక్ సాంగ్

వదినపై రూ. 2 కోట్ల పరువు నష్టం వేసిన హీరోయిన్ హన్సిక

విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా "తిమ్మరాజుపల్లి టీవీ" మూవీ ట్రైలర్ లాంఛ్

లవ్ స్టోరీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ బేబమ్మ రోల్.. ప్రదీప్ రంగనాథన్ స్వీట్ పర్సన్

బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపీ వుందా? ఐతే ఈ ఫ్రూట్స్ తిని చూడండి

మహిళల పాదరక్షలపై క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రవేశపెట్టిన పారాగాన్

పాలుతో పాటు తినకూడని పదార్థాలు ఏమిటి?

తమ కొత్త ప్రచారానికి రుక్మిణి వసంత్‌ను ఎంచుకున్న తనిష్క్

ఊబకాయం: అద్దంలో కనిపించే లావు కాదు, అడుగడుగునా పొంచి ఉన్న ఆరోగ్య సంక్షోభం

తర్వాతి కథనం
Show comments