కేసీఆర్‌కు వాళ్లను పట్టుకునే దమ్ముందా? బండి సంజయ్

Webdunia
సోమవారం, 4 ఏప్రియల్ 2022 (11:25 IST)
తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  హైదరాబాద్‌లో మళ్లీ డ్రగ్స్ కలకలం ఎందుకు రేగుతోంది అని ప్రశ్నించారు. డ్రగ్స్ బయటపడిన సందర్భాల్లో కఠినమైన చర్యలు తీసుకుంటాం ఉక్కుపాదం మోపుతామని కేసీఆర్‌ హడావిడి చేస్తున్నారని విమర్శించారు.

ఎంతోమంది ఉద్యమకారులు శ్రీకాంత్ చారి, సుమన్ లాంటివాళ్ళు మరెందరో ప్రాణత్యాగం చేస్తే తెలంగాణ వచ్చిందని, అలాంటి తెలంగాణలో మద్యం డ్రగ్స్ తదితర మత్తుపదార్థాల రాష్ట్రంగా కేసీఆర్ మార్చారని విమర్శించారు. 
 
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో సగం డ్రగ్స్ దందా టీఆర్ఎస్ నాయకులదేనని, వాళ్ల పేర్లు చెబితే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వాళ్లను పట్టుకునే దమ్ముందా? అని సవాల్ విసిరారు. 
 
గత ఏడేళ్లుగా తెలంగాణలో డ్రగ్స్ దందా నియంత్రణకు ముఖ్యమంత్రి ప్రభుత్వానికి చేత కావడం లేదా అని ప్రశ్నించారు. హైదరాబాద్ సిటీలో డ్రగ్స్ దందా కొనసాగిస్తున్న వారిలో సగం మంది టీఆర్ఎస్ నాయకులకు సంబంధించినవే అని, వారి పేర్లను చెబితే వాళ్లను పట్టుకుని జైళ్లకు పంపుతారా? అని సంజయ్‌ కేసీఆర్‌కు సవాల్ విసిరారు.
 
దేశంలోనే మద్యం జూదం ఆడే ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణను కేసీఆర్ తీర్చిదిద్దినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని బండి సంజయ్ విమర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srinidhi Shetty: సీత పాత్ర మిస్ అయ్యా, వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాలో చేయాలనుకుంటున్నా : శ్రీనిధి శెట్టి

Marriage Rumors: పెళ్లికి రెడీ అవుతున్న త్రిష.. చండీగఢ్‌ వ్యాపారవేత్తతో డుం.. డుం.. డుం..?

Teja: నటి సంతోషిని హెల్త్ కేర్ రిహాబిలిటేషన్ సెంటర్ లో దర్శకుడు తేజ

Charmi Kaur: విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్

అరి.. ప్రయాణంలో తండ్రిని, బావని కోల్పోయిన దర్శకుడు ఎమోషనల్ పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments