Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ లడ్డూకు భలే డిమాండ్ - గతం కంటే రూ.1.30 లక్షలు అధికం

Webdunia
ఆదివారం, 19 సెప్టెంబరు 2021 (10:47 IST)
హైదరాబాద్ నగరంలో బాలాపూర్ లడ్డూకు భలే గిరాకీ ఏర్పడింది. ఫలితంగా గత యేడాది కంటే ఈ లడ్డూ ధర రూ.1.30 లక్షలు అధికంగా పలికింది. కిందటేడాది కరోనా వైరస్ కారణంగా లడ్డూ వేలం పాటలు నిర్వహించలేదు. 2019లో రూ.17.60 లక్షల ధర పలుకగా, ఈ యేడాది ఈ లడ్డూ ధర రూ.18.90 లక్షలు పలికింది. 
 
తాజాగా జరిగిన వేలంపాటలో నాదర్‌గుల్‌కు చెందిన మర్రి శశాంక్‌ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ కడప ఎమ్మెల్సీ రమేశ్‌ యాదవ్‌తో కలిసి బాలాపూర్‌ గణేశుని లడ్డూని దక్కించుకున్నారు. 2019లో రూ.17.6 లక్షలకు కొలను రాంరెడ్డి సొంతం చేసుకున్నారు. గతేడాది కరోనా కారణంగా లడ్డూ వేలం పాట రద్దయింది.
 
ఇరు రాష్ట్రాల ప్రజలకు సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్సీ రమేశ్‌ యాదవ్‌ అన్నారు. శశాంక్‌ రెడ్డితో కలిసి లడ్డూని దక్కించుకున్నట్లు చెప్పారు. ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డికి లడ్డూని కానుకగా అందిస్తామన్నారు. 
 
తెలుగు రాష్ట్రాల ప్రజలకు భగవంతుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, కొలను రాంరెడ్డి హాజరయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments