Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆటో, క్యాబ్, లారీ డ్రైవర్స్.. ఒక్కరోజు బంద్‌కు పిలుపు

Webdunia
గురువారం, 19 మే 2022 (09:40 IST)
రాష్ట్ర ప్రభుత్వం నూతన మోటర్ వాహనాల చట్టం-2019 అమలు చేస్తూ జరిమానాలతో నిలువు దోపిడీ చేస్తోందని, నూతన చట్టంను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ నేడు ఆటో, క్యాబ్, లారీ డ్రైవర్స్ యూనియన్ ఐకాస రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరోజు బంద్‌కు పిలుపునిచ్చింది.
 
ఇంధన ధరలు పెరుగుదలతో క్యాబ్, ఆటోలకు గిట్టుబాటు కావటం లేదని, దీనికితోడు నూతన చట్టం పేరుతో ఎడాపెడా ఆటో, క్యాబ్ డ్రైవర్లకు జరిమానాలు విధిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని, వెంటనే నూతన మోటార్ వాహనాల చట్టం 2019ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
 
మరోవైపు ఆటోలు, క్యాబ్, లారీల డ్రైవర్లు గురువారం బంద్ పాటిస్తున్న క్రమంలో ప్రజలు ఇబ్బంది పడకుండా గ్రేటర్ హైదరాబాద్‌లో ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. బుధవారం అర్థరాత్రి నుంచే ముఖ్యమైన ప్రయాణికుల అవసరాల మేరకు ప్రత్యేక బస్సుల నడుపుతుంది. 
 
మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లో ప్రయాణీకులకు ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రత్యేక బస్సులను ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేశారు. పల్లెల్లకు రద్దీగా ఉండే రూట్లతో పాటు, జిల్లా కేంద్రాల్లో లోకల్ బస్సులు తిప్పేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments