Webdunia - Bharat's app for daily news and videos

Install App

మత్తయ్య సోదరుడిపై టీ పోలీసుల దాడి.. ఆధారాలు సేకరించిన ఏపీ పోలీసులు

Webdunia
సోమవారం, 6 జులై 2015 (08:49 IST)
ఓటుకు నోటు కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న జెరూసలెం మత్తయ్య సోదరుడు ప్రభుదాస్‌ను కొట్టింది ఎవరో తెలిసిపోయింది. కేసులో మత్తయ్యను భయభ్రాంతులకు గురిచేసేక్రమంలో తెలంగాణ పోలీసులే ప్రభుదాస్‌‍ను కొట్టినట్టు ఏపీ సీఐడీ పోలీసులు ఆధారాలు సేకరించారు. మత్తయ్య కుటుంబ సభ్యులను కూడా భయభ్రాంతులకు గురిచేసేచర్యల్లో భాగంగానే ఈ భౌతికదాడులకు దిగినట్టు తేల్చేశారు. 
 
అంతేకాకుండా, ప్రభుదాస్‌తో పాటు ఆయన భార్యకు కూడా తెలంగాణ పోలీసులు పలుమార్లు ఫోన్లు చేసి బెదిరించిన విషయంపై కూడా పక్కా ఆధారాలు లభ్యమైనట్టు సీఐడీ పోలీసులు చెపుతున్నారు. ఈ బెదిరింపులకు తెలంగాణ రాష్ట్ర పోలీసులతో పాటు అధికార తెరాస పార్టీ నేతలు కూడా పాల్పడినట్టు గుర్తించారు.
 
మత్తయ్య కుటుంబ సభ్యుల మొబైల్ కాల్‌డేటాను నిశితంగా పరిశీలించిన సీఐడీ అధికారులకు పలువురు టీఆర్ఎస్ నేతల ఫోన్ నెంబర్లను కూడా గుర్తించారు. దీనికి సంబంధించి మరింత పక్కాగా ఆధారాలు సేకరించి, ఆ తర్వాత ముందడుగు వేయాలని ఏపీ సీఐడీ భావిస్తోంది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments