Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణా భాజపా నేతలకు అమిత్ షా క్లాస్

Webdunia
మంగళవారం, 21 డిశెంబరు 2021 (20:01 IST)
తెలంగాణా రాష్ట్ర ముఖ్య నేతలతో అమిత్ షా జరిపిన భేటీ ఇప్పుడు తెలంగాణా రాష్ట్రంలో పెద్ద చర్చకు దారితీస్తోంది. పార్టీని మరింత బలోపేతం చేయాలని.. ఎక్కడ కూడా బిజెపి తగ్గకూడదని అమిత్ షా ఆదేశించినట్లు తెలుస్తోంది. 

 
ఢిల్లీ వేదికగా జరిగిన భేటీలో మొత్తం 20 నిమిషాల పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటెల రాజేందర్‌తో పాటు పలువురు ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. పార్టీ పరిస్థితితో పాటు నేతలు ఏవిధంగా కష్టపడాలన్న విషయంపై అమిత్ షా దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.

 
తెలంగాణాలో టిఆర్ఎస్ పైన యుద్ధం చేయాలని బిజెపి నేతలకు అమిత్ షా దిశానిర్ధేశం చేశారట. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను గట్టిగా ఎండకట్టాలని.. అలాగే పోరాటం కూడా చేయాలని ఆదేశించారట.

 
హుజరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన ఈటెల రాజేందర్‌ను అభినందించారట అమిత్ షా. వచ్చే ఎన్నికల్లో విజయం కోసం కృషి చేయాలని సూచించారట. 
 
ధాన్యం కొనుగోలుపై కేంద్ర వైఖరి స్పష్టంగా ఉందని.. టిఆర్ఎస్ కావాలనే దుష్ప్రచారం చేస్తోందని పలువురు నేతలు కేంద్రం దృష్టికి తీసుకెళ్ళారట.

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments