Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణా భాజపా నేతలకు అమిత్ షా క్లాస్

Webdunia
మంగళవారం, 21 డిశెంబరు 2021 (20:01 IST)
తెలంగాణా రాష్ట్ర ముఖ్య నేతలతో అమిత్ షా జరిపిన భేటీ ఇప్పుడు తెలంగాణా రాష్ట్రంలో పెద్ద చర్చకు దారితీస్తోంది. పార్టీని మరింత బలోపేతం చేయాలని.. ఎక్కడ కూడా బిజెపి తగ్గకూడదని అమిత్ షా ఆదేశించినట్లు తెలుస్తోంది. 

 
ఢిల్లీ వేదికగా జరిగిన భేటీలో మొత్తం 20 నిమిషాల పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటెల రాజేందర్‌తో పాటు పలువురు ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. పార్టీ పరిస్థితితో పాటు నేతలు ఏవిధంగా కష్టపడాలన్న విషయంపై అమిత్ షా దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.

 
తెలంగాణాలో టిఆర్ఎస్ పైన యుద్ధం చేయాలని బిజెపి నేతలకు అమిత్ షా దిశానిర్ధేశం చేశారట. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను గట్టిగా ఎండకట్టాలని.. అలాగే పోరాటం కూడా చేయాలని ఆదేశించారట.

 
హుజరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన ఈటెల రాజేందర్‌ను అభినందించారట అమిత్ షా. వచ్చే ఎన్నికల్లో విజయం కోసం కృషి చేయాలని సూచించారట. 
 
ధాన్యం కొనుగోలుపై కేంద్ర వైఖరి స్పష్టంగా ఉందని.. టిఆర్ఎస్ కావాలనే దుష్ప్రచారం చేస్తోందని పలువురు నేతలు కేంద్రం దృష్టికి తీసుకెళ్ళారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments