Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణా భాజపా నేతలకు అమిత్ షా క్లాస్

Webdunia
మంగళవారం, 21 డిశెంబరు 2021 (20:01 IST)
తెలంగాణా రాష్ట్ర ముఖ్య నేతలతో అమిత్ షా జరిపిన భేటీ ఇప్పుడు తెలంగాణా రాష్ట్రంలో పెద్ద చర్చకు దారితీస్తోంది. పార్టీని మరింత బలోపేతం చేయాలని.. ఎక్కడ కూడా బిజెపి తగ్గకూడదని అమిత్ షా ఆదేశించినట్లు తెలుస్తోంది. 

 
ఢిల్లీ వేదికగా జరిగిన భేటీలో మొత్తం 20 నిమిషాల పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటెల రాజేందర్‌తో పాటు పలువురు ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. పార్టీ పరిస్థితితో పాటు నేతలు ఏవిధంగా కష్టపడాలన్న విషయంపై అమిత్ షా దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.

 
తెలంగాణాలో టిఆర్ఎస్ పైన యుద్ధం చేయాలని బిజెపి నేతలకు అమిత్ షా దిశానిర్ధేశం చేశారట. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను గట్టిగా ఎండకట్టాలని.. అలాగే పోరాటం కూడా చేయాలని ఆదేశించారట.

 
హుజరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన ఈటెల రాజేందర్‌ను అభినందించారట అమిత్ షా. వచ్చే ఎన్నికల్లో విజయం కోసం కృషి చేయాలని సూచించారట. 
 
ధాన్యం కొనుగోలుపై కేంద్ర వైఖరి స్పష్టంగా ఉందని.. టిఆర్ఎస్ కావాలనే దుష్ప్రచారం చేస్తోందని పలువురు నేతలు కేంద్రం దృష్టికి తీసుకెళ్ళారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pranitha: అందమైన ప్రణిత సుభాష్ పవర్‌ఫుల్ రిటర్న్‌కు సిద్ధమవుతోంది

Rajani: రజనీకాంత్ స్టామినా 75 ఏళ్ల వయసులో కూడా తగ్గెదేలే

Naga Shaurya : బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగశౌర్య, విధి ఫస్ట్ సింగిల్

Nani: ది ప్యారడైజ్ నుంచి రగ్గడ్, స్టైలిష్ అవతార్‌లో నాని

Rukmini : కాంతార చాప్టర్ 1 నుంచి కనకావతి గా రుక్మిణి వసంత్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

తర్వాతి కథనం
Show comments