Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాగి తొంగునేవారు ప్రజాసేవ చేస్తారా? : నటి ఖుష్బూ

Webdunia
శనివారం, 17 నవంబరు 2018 (09:40 IST)
తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్‌పై సినీ నటి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఖుష్బూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పీకలవరకు మద్యం సేవించి ఫామ్‌హౌస్‌లో సేదతీరేవారు ఎలా ప్రజాసేవ చేస్తారంటూ ఆమె ప్రశ్నించారు. 
 
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్చర్లలో ఆమె విలేకరులోతో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రమంటే కేవలం ఆ నలుగురు కుటుంబ సభ్యులు మాత్రమేకాదన్నారు. ఆ నలుగురు మాత్రమే ఈ నాలుగేళ్లలో కోట్లకు పడగలెత్తారని ధ్వజమెత్తారు. కేవలం నలుగురు వ్యక్తులు నాలుగు కోట్ల మందిని పాలిస్తున్నారనీ, కేసీఆర్ ఫ్యామిలీ నియంతృత్వ పాలనసాగిస్తోందని ఆరోపించారు. 
 
ముఖ్యంగా, కేసీఆర్ మంత్రివర్గంలో ఒక్కరంటే ఒక్కరు కూడా మహిళా మంత్రి లేరన్నారు. కానీ, ఆయన కుమార్తెకు మాత్రం పార్లమెంట్‌లో పదవులు కావాలన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు. 
 
అదేసమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైతే మహిళలకు మంత్రిపదవులు మాత్రమేకాకుండా సముచిత స్థానం కూడా దక్కుతుందన్నారు. తెరాస తరహాలో తమది మాటల పార్టీ కాదని చేతల పార్టీ అని ఆమె గుర్తుచేశారు. గతంలో కేసీఆర్,  తెరాస చేసిన హామీల్లో ఒక్కటి కూడా అమలుకాలేదని ఖుష్బూ చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముత్తయ్య నుంచి అరవైల పడుసోడు.. సాంగ్ రిలీజ్ చేసిన సమంత

Odela2 review: తమన్నా నాగసాధుగా చేసిన ఓదేల 2 చిత్రం ఎలావుందో తెలుసా

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments