Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాగి తొంగునేవారు ప్రజాసేవ చేస్తారా? : నటి ఖుష్బూ

Webdunia
శనివారం, 17 నవంబరు 2018 (09:40 IST)
తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్‌పై సినీ నటి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఖుష్బూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పీకలవరకు మద్యం సేవించి ఫామ్‌హౌస్‌లో సేదతీరేవారు ఎలా ప్రజాసేవ చేస్తారంటూ ఆమె ప్రశ్నించారు. 
 
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్చర్లలో ఆమె విలేకరులోతో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రమంటే కేవలం ఆ నలుగురు కుటుంబ సభ్యులు మాత్రమేకాదన్నారు. ఆ నలుగురు మాత్రమే ఈ నాలుగేళ్లలో కోట్లకు పడగలెత్తారని ధ్వజమెత్తారు. కేవలం నలుగురు వ్యక్తులు నాలుగు కోట్ల మందిని పాలిస్తున్నారనీ, కేసీఆర్ ఫ్యామిలీ నియంతృత్వ పాలనసాగిస్తోందని ఆరోపించారు. 
 
ముఖ్యంగా, కేసీఆర్ మంత్రివర్గంలో ఒక్కరంటే ఒక్కరు కూడా మహిళా మంత్రి లేరన్నారు. కానీ, ఆయన కుమార్తెకు మాత్రం పార్లమెంట్‌లో పదవులు కావాలన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు. 
 
అదేసమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైతే మహిళలకు మంత్రిపదవులు మాత్రమేకాకుండా సముచిత స్థానం కూడా దక్కుతుందన్నారు. తెరాస తరహాలో తమది మాటల పార్టీ కాదని చేతల పార్టీ అని ఆమె గుర్తుచేశారు. గతంలో కేసీఆర్,  తెరాస చేసిన హామీల్లో ఒక్కటి కూడా అమలుకాలేదని ఖుష్బూ చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్‌లో విరాట్ కర్ణ చిత్రం నాగబంధం

సుహాస్ , కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్పురంబు ట్రెయిలర్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments