Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు ప్రలోభాల కేసు : నిందితుల విడుదల

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2022 (12:40 IST)
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల కేసులో నిందితులను రిమాండ్‌కు పంపించేందుకు ఏసీబీ కోర్టు నిరాకరించింది. లంచాలు ఇవ్వజూపినట్టు నిరూపించేందుకు సరైన ఆధారాలు లేవని పేర్కొంది. పైగా, స్వాధీనం చేసుకున్న డబ్బు ఎంతో కూడా పోలీసులు స్పష్టత ఇవ్వలేదని గుర్తు చేసింది. లంచం సొమ్ము దొరకనందున పీసీ యాక్ట్ వర్తిందని, అందువల్ల నిందితులను తక్షణం విడిచిపెట్టాలని గత రాత్రి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. 
 
తెరాస ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో అరెస్టు అయిన ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించేందుకు ఏసీబీ ప్రత్యేక కోర్టు నిరాకరించింది. సరైన ఆధారాలు లేవన్న న్యాయస్థానం వారిని తక్షణం విడుదల చేయాలని ఆదేశించింది, అలాగే, 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చిన తర్వాత విచారించిన న్యాయమూర్తి జి.రాజగోపాల్ పోలీసులను ఆదేశించారు. 
 
అరెస్టు సందర్భంగా లంచం సొమ్ము దొరకనందున ఈ కేసుకు అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్) వర్తించదని పేర్కొన్నారు. ప్రలోభాల కేసులో అరెస్టు అయిన నిందితులు రామచంద్ర భారతి, సింహయాజి, నందకుమార్‌లను పోలీసులు గురువారం రాత్రి సరూర్ నగర్‌లోని న్యాయమూర్తి నివాసానికి తీసుకెళ్లి హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాలతో వారిని విడిచిపెచ్చినట్టు శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments