Webdunia - Bharat's app for daily news and videos

Install App

కటకటాల్లోకి అవినీతి తిమింగలం - ఏసీపీ నర్సింహా రెడ్డి అరెస్టు

Webdunia
గురువారం, 24 సెప్టెంబరు 2020 (09:21 IST)
ఆదాయానికి మించి ఆస్తులు పోగు చేసిన కేసులో మల్కాజిగిరి ఏసీపీ నర్సింహారెడ్డిని అవినీతి నిరోధక శాఖ పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను గురువారం ఏసీబీ కోర్టులో హాజరుపరిచనున్నారు. ఈయన ఆస్తులు ప్రాథమికంగా 70 కోట్ల రూపాయల మేరకు ఉన్నట్టు గుర్తించారు. 
 
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో విధుల నిర్వహించిన నర్సింహారెడ్డి.. పలు భూసెటిల్మెంట్లు చేసి అక్రమార్జనకు పాల్పడినట్టు ఏసీబీకి పక్కా సమాచారం వచ్చింది. దీంతో బుధవారం ఆయన నివాసంతో పాటు ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్ళలో ఏక కాలంలో 25 చోట్ల ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ తనిఖీలు ఉమ్మడి వరంగల్, కరీంనగర్, అనతంపురం, హైదరాబాద్ జిల్లాల్లో జరిగాయి. 
 
ఈ సందర్భంగా మొత్తం రూ.70 కోట్ల ఆస్తులును ప్రాథమికంగా గుర్తించారు. హైదరాబాద్‌లో 3 ఇళ్లు, 5 ఇంటి స్థలాలు ఉన్నట్టు కనుగొన్నారు. నర్సింహారెడ్డిని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు ఆయనను నాంపల్లిలోని తమ కార్యాలయానికి తరలించారు. గురువారం ఏసీబీ కోర్టులో ఆయనను ప్రవేశపెట్టనున్నట్టు ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్ రవీందర్‌రెడ్డి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

మిడిల్ క్లాస్ కుర్రాడు అమర్ దీప్ చెబుతున్న సుమతీ శతకం

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments