కటకటాల్లోకి అవినీతి తిమింగలం - ఏసీపీ నర్సింహా రెడ్డి అరెస్టు

Webdunia
గురువారం, 24 సెప్టెంబరు 2020 (09:21 IST)
ఆదాయానికి మించి ఆస్తులు పోగు చేసిన కేసులో మల్కాజిగిరి ఏసీపీ నర్సింహారెడ్డిని అవినీతి నిరోధక శాఖ పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను గురువారం ఏసీబీ కోర్టులో హాజరుపరిచనున్నారు. ఈయన ఆస్తులు ప్రాథమికంగా 70 కోట్ల రూపాయల మేరకు ఉన్నట్టు గుర్తించారు. 
 
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో విధుల నిర్వహించిన నర్సింహారెడ్డి.. పలు భూసెటిల్మెంట్లు చేసి అక్రమార్జనకు పాల్పడినట్టు ఏసీబీకి పక్కా సమాచారం వచ్చింది. దీంతో బుధవారం ఆయన నివాసంతో పాటు ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్ళలో ఏక కాలంలో 25 చోట్ల ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ తనిఖీలు ఉమ్మడి వరంగల్, కరీంనగర్, అనతంపురం, హైదరాబాద్ జిల్లాల్లో జరిగాయి. 
 
ఈ సందర్భంగా మొత్తం రూ.70 కోట్ల ఆస్తులును ప్రాథమికంగా గుర్తించారు. హైదరాబాద్‌లో 3 ఇళ్లు, 5 ఇంటి స్థలాలు ఉన్నట్టు కనుగొన్నారు. నర్సింహారెడ్డిని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు ఆయనను నాంపల్లిలోని తమ కార్యాలయానికి తరలించారు. గురువారం ఏసీబీ కోర్టులో ఆయనను ప్రవేశపెట్టనున్నట్టు ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్ రవీందర్‌రెడ్డి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments