Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాదాపూర్‌లో భారీ చోరీ : వ్యాపారి ఇంట్లో రూ.50 లక్షలు చోరీ

Webdunia
శనివారం, 26 ఫిబ్రవరి 2022 (11:40 IST)
హైదరాబాద్ నగరంలోని మాదాపూర్‌లో భారీ చోరీ జరిగింది. శనివారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, మాదాపూర్‌లోని కావూరి హిల్స్ ఫేజ్ 2లో వాసుదేవ రెడ్డి అనే వ్యాపారి నివసిస్తున్నారు. ఈయన గురువారం సాయంత్రం తన కుటుంబ సభ్యులతో కలిసి మెయినాబాద్ సమీపంలోని తన ఫామ్‌హౌజ్‌కు వెళ్లి రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చారు. అయితే, ఇంటి తాళం విరగ్గొట్టి ఉండటం చూసిన హతాశులయ్యారు. 
 
ఆ తర్వాత ఇంట్లోకి వెళ్లి చూడగా కప్‌బోర్డులో ఉంచిన రూ.20 లక్షల నగదుతో పాటు కొంతమొత్తంలో అమెరికన్ డాలర్లు, రూ.30 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దాచివుంచిన సేఫ్ లాకర్ మాయమైనట్టు గుర్తించారు. ఆ వెంటనే మాదాపూర్ పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments