Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాదాపూర్‌లో భారీ చోరీ : వ్యాపారి ఇంట్లో రూ.50 లక్షలు చోరీ

Webdunia
శనివారం, 26 ఫిబ్రవరి 2022 (11:40 IST)
హైదరాబాద్ నగరంలోని మాదాపూర్‌లో భారీ చోరీ జరిగింది. శనివారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, మాదాపూర్‌లోని కావూరి హిల్స్ ఫేజ్ 2లో వాసుదేవ రెడ్డి అనే వ్యాపారి నివసిస్తున్నారు. ఈయన గురువారం సాయంత్రం తన కుటుంబ సభ్యులతో కలిసి మెయినాబాద్ సమీపంలోని తన ఫామ్‌హౌజ్‌కు వెళ్లి రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చారు. అయితే, ఇంటి తాళం విరగ్గొట్టి ఉండటం చూసిన హతాశులయ్యారు. 
 
ఆ తర్వాత ఇంట్లోకి వెళ్లి చూడగా కప్‌బోర్డులో ఉంచిన రూ.20 లక్షల నగదుతో పాటు కొంతమొత్తంలో అమెరికన్ డాలర్లు, రూ.30 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దాచివుంచిన సేఫ్ లాకర్ మాయమైనట్టు గుర్తించారు. ఆ వెంటనే మాదాపూర్ పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments