Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ 2 ఛానెళ్ళ ప్రసారాలు కావాలని ప్రజలు అడగట్లేదు..

Webdunia
మంగళవారం, 21 అక్టోబరు 2014 (13:18 IST)
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ9 టీవీ ప్రసారాలను తమకు కావాలని తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం అడగడం లేదని, అందుకే వాటి ప్రసారాలను నిలిపివేసినట్టు తెలంగాణ ఎంఎస్ఓ సంఘం అధ్యక్షుడు సుభాష్ రెడ్డి ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలో టీవీ9, ఏబీఎన్ ఛానెళ్ల ప్రసారాలను తెలంగాణ సర్కారు నిలిపివేసిన విషయం తెల్సిందే. ఈ విషయంలో జర్నలిస్టులు అనేక రకాలైన ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే, కేబుల్ ఆపరేటర్ల సంఘం అధ్యక్షుడు సుభాష్ రెడ్డి ఒక వింతైన ప్రకటన చేశారు. 
 
‘ప్రజలు ఆ రెండు ఛానెళ్ళని ప్రసారాలను ప్రసారం చేయాలని కోరడం లేదు. అందుకే ప్రసారం చేయడం లేదు. ఆ రెండు ఛానెళ్ళ ప్రసారాలను నిలిపివేయడంలో ప్రభుత్వ పాత్ర, ఎంఎస్‌ఓల పాత్ర ఏమీ లేదు. న్యాయస్థానాలు కూడా మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చాయి. వ్యాపార ఒప్పందాలు కొనసాగించే ఆలోచన ఆ రెండు సంస్థల యాజమాన్యాలకు లేదని పేర్కొన్నారు.
 
మరి మిగిలిన చానెళ్లను తెలంగాణ ప్రజలు కోరుకుంటేనే సుభాష్ రెడ్డి గారు ప్రసారం చేస్తున్నారా అనే ప్రశ్నలు ఉత్పన్నవుతున్నాయి. ఆ రెండు చానెళ్ళను మాత్రమే నిలుపుదల చేయాలంటూ ప్రజలు ఆయనకు లేఖలు రాశారా అని పలువురు రాజకీయ నేతలు ప్రశ్నిస్తున్నారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments