Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెల్ట్ షాప్‌కు పర్మిషన్ ఇవ్వమని ఆ పని చేసిన మహిళ... అంతా చోద్యం చూశారు...

Webdunia
శనివారం, 3 ఆగస్టు 2019 (19:40 IST)
ఎక్సైజ్ అధికారుల వేధింపులు, కుల సంఘం పెద్దల వేధింపులు భరించలేక ఒక మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకుంది. తన చావుకు వాళ్ళే కారణమంటూ సుసైడ్ నోటు రాసింది. పురుగుల మందు సేవించి ప్రస్తుతం చావుబతుకుల మధ్య మృత్యువుతో పోరాడుతోంది.
 
నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలానికి చెందిన లాస్య అనే వివాహిత కొంతకాలంగా కల్లు దుకాణం నడుపుతోంది. బెల్ట్ షాప్ పర్మిషన్ కూడా ఇప్పించాలని గ్రామపెద్దలను కోరింది. అదే గ్రామానికి చెందిన గంగాధర్ కూడా తనకి కూడా బెల్ట్ షాప్ కావాలని పట్టుబట్టాడు. ఈ క్రమంలో అతడు లాస్య ఇంటికి వచ్చి గొడవ చేయగా పోలీసులకు పట్టించారు స్థానికులు.
 
గంగాధర్ తరపున గ్రామపెద్దలు లాస్యకు వార్నింగ్ ఇచ్చారు. కులపెద్దలు కూడా ఏకమైన ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కూడా పిలిచి వార్నింగ్ ఇచ్చారు. దీంతో మనస్థాపానికి గురైన లాస్య పురుగుల మందు చేతిలో పట్టుకుని గ్రామస్తుల ముందు నిలబడింది. వారు ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో వారి ముందే ఆ పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. తన ఆర్థిక స్థోమత సరిగ్గా లేదని బెల్ట్ షాపుకు అనుమతి ఇవ్వాలని కోరుతోంది లాస్య.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments