Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీచర్ కొడుతుందని మేడపై నుంచి దూకేసిన విద్యార్థి...

Webdunia
శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (13:35 IST)
హైదరాబాదులో స్కూల్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేగుతోంది. స్కూల్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్య యత్నం చేసిన బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్ఆర్ నగర్ లోని విశ్వభారతి హైస్కూల్‌లో మహేష్ 8 తరగతి చదువుతున్నాడు. హోంవర్క్ చేయకపోవడంతో టీచర్ అందరి విద్యార్థుల్ని మందలించి కొడుతున్నారు.
 
ఇది చూసిన మహేష్‌కు భయం పట్టుకుంది. తనను కూడా టీచరు కొడుతుందని భయం పట్టుకుంది. దీంతో భవనం పైనుంచి ఒక్కసారిగా కిందకు దూకాడు. దీంతో మహేష్‌కు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే స్కూల్ యాజమాన్యం పక్కనే ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. గత నెల 28వ తేదీన స్కూలు మేడ పైనుంచి దూకిన మహేష్ ఇవాళ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
 
దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంతో పాటుగా టీచర్ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన సమాచారంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చనిపోయిన మహేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అనారోగ్యంతో వున్న నటుడు రామచంద్రను పరామర్శించిన మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments