Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతితో సహజీవనం, పెళ్లనగా నాకు ఆల్రెడీ పెళ్లాం వుందన్న ప్రియుడు

Webdunia
సోమవారం, 3 ఆగస్టు 2020 (15:18 IST)
ఫేస్‌బుక్‌‌లో పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోకుండానే ఇద్దరూ కొంతకాలం సహజీవనం చేశారు. తీరా యువతి పెళ్లి చేసుకోమనగానే సదరు యువకుడు తనకు ఇంతకుమునేపే పెళ్లి జరిగిందని యువతితో చెప్పడంతో ఖంగుతిన్న సదరు యువతి పోలీసులను ఆశ్రయించింది.
 
రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్  ఎయిర్‌పోర్ట్ అధారిటీ పోలీస్ సీఐ విజయ్‌కుమార్‌ తెలిపిన వివరాలు ప్రకారం... నగరంలోని కుషాయిగూడ చక్రిపురం కాలనీకి చెందిన యువతి(23) డ్యాన్సర్‌‌గా పనిచేస్తోంది. అదే మండలంలోని బహదూర్‌గూడకు చెందిన రాజ్‌కుమార్‌ (25) ఇద్దరకీ  ఏడాదిన్నర కిందటే ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఎనిమిది నెలల కిందట ఆర్‌బీనగర్‌లో భార్యభర్తలుగా చెప్పుకుంటూ అద్దె గదిలో నివాసముంటూ సహజీవనం చేశారు.
 
ఇటీవల ఇద్దరి మధ్యన మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. యువతి తనను వివాహం చేసుకోవాల్సిందిగా రాజ్‌కుమార్‌ను కోరడంతో తనకు అప్పటికే పెళ్లి జరిగిందని తేల్చి చెప్పడంతో పాటు సదరు యువతిని పెళ్లి చేసుకోనని చెప్పడంతో మోసపోయినట్లుగా గుర్తించిన యువతి ఆదివారం ఆర్‌జీఐఏ పోలీసులను ఆశ్రయించింది. తనను నమ్మించి మోసం చేశాడని వాపోయింది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments