Webdunia - Bharat's app for daily news and videos

Install App

కసాయి భర్త: భార్యను కొట్టి.. పురుగుల మందు తాగించి హత్య

Webdunia
శుక్రవారం, 27 మార్చి 2015 (06:05 IST)
మద్యం మత్తులో తాను ఏం చేస్తున్నాడో తనకే అర్థకానీ స్థితి.. జీవితాంతం తోడుంటానని ప్రమాణంచేసిన భర్తే చితకబాదాడు. ఆపై ఇంట్లోని పురుగుల మందు తీసుకొచ్చి బలవంతంగా తాగించాడు. ఆమెను హత్య చేశాడు. పిల్లలు అనాథలుగా మిగిలారు. ఆయనే కటకటాల పాలయ్యాడు. ఖమ్మం జిల్లాలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి.
 
ఖమ్మం జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యను మద్యం మత్తులో చితకబాది, పురుగుల మందు తాగించి హత్య చేశాడు ఓ కసాయి భర్త. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం, పడమట నర్సాపురం గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..  ఆ గ్రామానికి చెందిన బూరుగు నర్సమ్మ(32), ముక్తేశ్వరరావు భార్యాభర్తలు. 
 
ముక్తేశ్వర రావు బుధవారం రాత్రి మద్యం తాగి భార్యను కొట్టాడు. అంతటితో ఆగకుండా ఆమె నోట్లో పురుగుమందు పోశాడు. కొన ఊపిరితో ఉన్న నర్సమ్మను స్థానిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం ఆమె మరణించింది. దీంతో ఆగ్రహించిన నర్సమ్మ తరపు బంధువులు ముక్తేశ్వరరావుకు దేహశుద్ధి చేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments