Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య... చేస్తుంటే వీడియో తీశారు...

Webdunia
శుక్రవారం, 31 మే 2019 (19:58 IST)
నడిరోడ్డుపై హత్యలు అక్కడక్కడా జరుగుతూనే వున్నాయి. కారణాలు ఏమయితేనే... మానవత్వం నశించి రాక్షసత్వం మేల్కొన్నప్పుడు అలాంటి స్థితిలో తోటి మనిషిని నరికి చంపేస్తుంటారు కొందరు. ఇలాంటి దారుణ ఘటనే తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగర శివారులో జరిగింది. పట్టపగలే కత్తులతో ఓ వ్యక్తిని అందరూ చూస్తుండగానే అతి దారుణంగా నరికి చంపారు.
 
సంగారెడ్డి జిల్లా జాతీయ రహదారిపై పటాన్‌చెరు మండలంలోని రుద్రారం వద్ద జాతీయ రహదారిపై వెళుతున్న మహబూబ్‌ అనే వ్యక్తి తనను ఇద్దరు వ్యక్తులు ఫాలో అవడాన్ని గమనించాడు. అంతే... వేగంగా అతడు పారిపోవాలని ప్రయత్నించాడు. కానీ అతడిని ఆ ఇద్దరు వ్యక్తులు తమ బైకులపై వెంబడించి అడ్డుకుని కత్తులతో నరికారు. 
 
అతడు రోడ్డుపై రక్తపు మడుగులో పడిపోగా కసితీరా కత్తులతో నరికి చంపేశారు. ఇదంతా రోడ్డుపై వాహనాల్లో వెళ్తున్నవారు చూస్తూనే వున్నారు. కానీ ఎవ్వరూ ఆ దారుణాన్ని ఆపే ప్రయత్నం చేయలేదు. మహబూబ్ మృతి చెందాడని తెలుసుకున్న తర్వాత హంతకులు ఇద్దరూ అక్కడి నుంచి పారిపోయారు. ఇదంతా కొందరు వీడియో తీస్తూ వున్నారు తప్పించి ఆ దారుణాన్ని ఆపే సాహసం మాత్రం చేయలేదు. కాగా హతుడు ఓ హత్య కేసులో నిందితుడుగా వున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments