Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంబులెన్స్ సౌకర్యం లేక.. బైకుపై కుమార్తె మృతదేహం.. ఓ తండ్రి కన్నీటి గాథ!

Webdunia
సోమవారం, 7 నవంబరు 2022 (10:18 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో మానవ సమాజం తలదించుకునే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. అంబులెన్స్ సౌకర్యం లేక బిడ్డ మృతదేహాన్ని బైకుపై ఇంటికి తరలించాడు. ఈ దారుణం ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం కొత్తమేడేపల్లి గ్రామంలో జరిగింది. 
 
ఈ గ్రామానికి చెందిన గిరిజన బాలిక అనారోగ్యంతో బాధపడుతూ ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. ఆస్పత్రిలో ఉచిత అంబులెన్స్ సేవలు లేకపోవడంతో ప్రైవేట్ అంబులెన్స్‌కు డబ్బుులు ఇచ్చే స్థోమత లేక కుమారుత శవాన్ని తండ్రి తన బైకుపైనే తీసుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
దీనిపై బాధిత తండ్రి మాట్లాడుతూ, ఆస్పత్రిలో ఉచిత అంబులెన్స్ సర్వీస్ లేదని, పైగా, ప్రైవేటు అంబులెన్స్‌కు డబ్బులు చెల్లించే ఆర్థిక స్తోమత తనకు లేదన్నారు. అందుకే చనిపోయిన తన కుమార్తె శవాన్ని 50 కిలోమీటర్ల దూరం బైకుపై ప్రయాణించి గ్రామానికి తీసుకొచ్చినట్టు  చెప్పాడు. ఈ మార్గంలో ఓ వాగును కూడా దాటుకుని ఇంటికి చేరినట్టు బోరున విలపిస్తూ చెప్పాడు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments