Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ నెల 25 నుంచి 30 వారాంతపు ప్రత్యేక రైళ్ళు

Webdunia
బుధవారం, 20 జులై 2022 (08:42 IST)
తెలంగాణ రాష్ట్రంలోని దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈ నెల 25వ తేదీ నుంచి 30 వారాంతపు ప్రత్యేక రైళ్ళను నడపాలని రైల్వే శాఖామంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అలాగే, వడియారంలో రైల్వే టిక్కెట్ కౌంటర్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. 
 
ముఖ్యంగా, హైదరాబాద్‌ - తిరుపతి - హైదరాబాద్‌, కాచిగూడ - నర్సాపూర్‌, నర్సాపూర్‌ - తిరుపతి, తిరుపతి - కాచిగూడ స్టేషన్ల మధ్య జులై 25 నుంచి ఆగస్టు 31 మధ్య 30 ప్రత్యేక రైళ్లను నడుపనున్నారు.
 
రంగారెడ్డి జిల్లా చేగూరులో జరిగే అంతర్జాతీయ ధ్యాన కార్యక్రమం నేపథ్యంలో 21, 23 తేదీల్లో చెంగల్పట్టు - కాచిగూడ, యల్హంక - కాచిగూడ, ముంబై సీఎస్‌టీ - భువనేశ్వర్‌, రాజ్‌కోట్‌ - సికింద్రాబాద్‌ రైళ్లు వికారాబాద్‌లో ఆగుతాయి. 
 
25, 26ల్లో కాచిగూడ - చెంగల్పట్టు రైలు షాద్‌నగర్‌లో, భువనేశ్వర్‌ - ముంబై సీఎస్‌టీ, సికింద్రాబాద్‌ - రాజ్‌కోట్‌ రైళ్లు వికారాబాద్‌లో ఆగనున్నాయి. మరోవైపు, సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ పునరభివృద్ధి కోసం పిలిచిన టెండర్ల బిడ్లను ఈ నెల 29న తెరవనున్నారు.  అలాగే, సికింద్రాబాద్‌, నెల్లూరు, తిరుపతి స్టేషన్ల అభివృద్ధికి ప్రతిపాదించిన పనులను ద.మ.రైల్వే ఇన్‌ఛార్జి జీఎం అరుణ్‌కుమార్‌జైన్‌ సమీక్షించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments