Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు ప్రయాణికులకు శుభవార్త.. సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు

Webdunia
శుక్రవారం, 30 డిశెంబరు 2022 (11:40 IST)
రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. సంక్రాంతికి సొంతూర్లకు వెళ్లే వారి కారణంగా ఏర్పడే రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్ళను నడపాలని నిర్ణయించింది. సికింద్రాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ఈ రైళ్ళను నడుపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. 
 
ముఖ్యంగా, సికింద్రాబాద్‌తో సహా నాంపల్లి, కాచిగూడ, వికారాబాద్‌ల నుంచి నర్సాపూర్, మచిలీపట్నం, కాకినాడ నగరాలకు వీటిని నడుపుతామని తెలిపింది. పండగ రద్దీని నివారించేందుకు ఇప్పటికే ప్రకటించిన రైళ్లకు ఇవి అదనమని తెలిపింది. ఈ రైళ్లు జనవరి ఒకటో తేదీ నుంచి జనవరి 20వ తేదీ వరకు ఆయా నగరాల మధ్య నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్.రాకేశ్ తెలిపారు.
 
సికింద్రాబాద్, హైదరాబాద్ నగరాల నుంచి రాత్రి వేళ బయలుదేరి ఉదయానికి గమ్యస్థానం చేరుకునేలా ఈ రైళ్లను నడుపుతామన్నారు. ఇందులో జనరల్, రిజర్వుడ్, ఏసీ బోగీలు ఉంటాయని తెలిపారు. కాగా, సంక్రాంతి కోసం ఇప్పటికే 94 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. ఇపుడు ప్రకటించిన ప్రత్యేక రైళ్ళతో కలుపుకుని మొత్తం ప్రత్యేక రైళ్ల సంఖ్య 124కు చేరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments