Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్, సికింద్రాబాద్ ల నుంచి 121 స్పెషల్ ట్రైన్లు

Webdunia
శనివారం, 28 డిశెంబరు 2019 (17:44 IST)
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. హైదరాబాద్‌ - రామేశ్వరం మధ్య 18 సర్వీసులు నడపనున్నట్లు పేర్కొంది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో అన్ని శుక్రవారాల్లో హైదరాబాద్‌ నుంచి మధ్యాహ్నం 2.30గంటలకు రైలు బయలుదేరుతుందని చెప్పింది.

హైదరాబాద్‌–తిరుచిరాపల్లికి 16 సర్వీసులు నడపనున్నట్లు తెలిపింది. అన్ని సోమవారాల్లో రాత్రి 10.20 గంటలకు హైదరాబాద్‌ నుంచి ట్రైన్‌ స్టార్ట్‌ అవుతుందని పేర్కొంది. విల్లుపురం–సికింద్రాబాద్‌కు 18 సర్వీసులు నడపనున్నట్లు చెప్పింది. అన్ని బుధవారాల్లో విల్లుపురంలో సాయంత్రం 4 గంటలకు ట్రైన్‌ బయలుదేరుతుందని తెలిపింది.

అన్ని శుక్ర, ఆదివారాల్లో చైన్నెసెంట్రల్‌ నుంచి సికింద్రాబాద్‌కు 34 సర్వీసులు నడపనున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్లు శని, సోమవారాల్లో సికింద్రాబాద్‌కు చేరుకుని, తిరిగి అవే రోజుల్లో రాత్రి 8 గంటలకు చెన్నై  బయలుదేరనున్నట్లు వెల్లడించింది. హైదరాబాద్‌ – కొచువెలికి 17 సర్వీసులు, హైదరాబాద్‌ – ఎర్నాకులం మధ్య 18 సర్వీసులు నడపనున్నట్లు పేర్కొంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments