Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో నేటి నుంచి టెన్త్ పరీక్షలు... హాజరుకానున్న 4.94 లక్షల మంది

Webdunia
సోమవారం, 3 ఏప్రియల్ 2023 (08:25 IST)
తెలంగాణ రాష్ట్రంలో సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షలకు దాదాపు 4.94 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో 78 శాతం మంది విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం వారే కావడం గమనార్హం. ఈ పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2652 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేశారు. పరీక్షా హాలులోకి ఉదయం 8.30 గంటల నుంచే అనుమతిస్తారు. అయితే, తొలి రోజున పరీక్షా కేంద్రంలోని ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతిస్తారు. 
 
ఈ పరీక్షలకు హాజరవుతున్న మొత్తం విద్యార్థులు 4,94,620 మంది కాగా, వీరిలో రెగ్యులర్ విద్యార్థుల 4,85,826 మంది ఉన్నారు. 8,632 మంది ఒకసారి ఫెయిల్ అయినవారు ఉన్నారు. కాగా, ఓరియంటల్ విద్యార్థులు 162 మంది ఉన్నారు. 
 
మొత్తం విద్యార్థుల్లో 78 శాతం మంది అంటే 3,78,794 మంది ఇంగ్లీష్ మీడియంకు చెందిన వారు కాగా, 98,726 మంది తెలుగు, 7,851 మంది ఉర్దూ, 235 మంది హిందీ, 137 మంది మరాఠీ, 83 మంది కన్నడ మాధ్యమంలో పరీక్షలు రాయనున్నారు. ప్రతి రోజూ పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 గంటలకు మొదలవుతుంది.
 
కాగా, ఈ పరీక్షను సాధారణంగా 11 పేపర్లలో నిర్వహించాల్సి వుండగా ఈసారి ఒక్కో సబ్జెక్టుకు ఒకటి చొప్పున ఆరు పేపర్లతో మాత్రమే నిర్వహిస్తారు. విద్యార్థులకు పరీక్ష కేంద్రాల్లో 8.30 గంటలకు నుంచే అనుమతిస్తారు. పరీక్ష కేంద్రానికి కనీసం అరగంట ముందు చేరుకోవాలని అధికారులు సూచించారు. మొదటి రోజు మాత్రం 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతిస్తారు. 
 
అదేసమయంలో ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టిక్కెట్లను చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. ఇక కాపీయింగ్ నిరోధానికి మొత్తం 144 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా

విష్ణు కన్నప్ప కథ చెప్పాక రీసెర్చ్ చేశా; శ్రీకాళహస్తి అర్చకులు మెచ్చుకున్నారు : ముఖేష్ కుమార్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments