Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్మల్ : హోటల్‌లో భోజనం చేసిన MP మహిళ మృతి.. 9 మందికి అస్వస్థత

సెల్వి
మంగళవారం, 5 నవంబరు 2024 (18:19 IST)
నిర్మల్ పట్టణంలోని ఓ హోటల్‌లో భోజనం చేసి అస్వస్థతకు గురైన పది మందిలో ఒకరు చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. బోథ్ మండలం పొచ్చెర గ్రామంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో వంట మనిషి, మధ్యప్రదేశ్‌కు చెందిన ఫుల్ కలి బైగా (19) ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు నిర్మల్ పోలీసులు తెలిపారు. ఆదివారం పట్టణంలోని గ్రిల్ నైన్ హోటల్‌లో భోజనం చేసిన పది మందికి విరేచనాలు, వాంతులు అయ్యాయి. 
 
నిర్మల్‌లో వస్త్రాల కోసం షాపింగ్ చేసి హోటల్‌లో పాఠశాల సిబ్బందితో పాటు వంట మనిషి చికెన్ కూర, అన్నం పెట్టించినట్లు తెలిసింది. ఇలా వీరిలో ఒకరు ఆసుపత్రి పాలయ్యారు. ఈ అస్వస్థతకు కారణం ఫుడ్ పాయిజన్ అని వైద్యులు తెలిపారు. మిగిలిన వారు సోమవారం ఆసుపత్రిలో చేరారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. దీంతో పాఠశాల ప్రిన్సిపాల్‌ స్మిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. హోటల్‌పై కేసు నమోదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments