Webdunia - Bharat's app for daily news and videos

Install App

కామారెడ్డి: రోడ్డుపై చిరుత పులి.. కారు బోల్తా.. మహిళ మృతి

సెల్వి
గురువారం, 27 జూన్ 2024 (11:36 IST)
కామారెడ్డిలో చిరుత కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మంగళవారం రాత్రి కామారెడ్డి జిల్లా గాంధారి మండలం ఎల్లమ్మకుంట-అమ్రాబాద్ మధ్య రోడ్డుపై చిరుత పులిని గుర్తించిన డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో కారు బోల్తా పడడంతో ఓ మహిళ మృతి చెందింది. మృతురాలిని గాంధారి మండలం యాచారంకు చెందిన మాలోత్ లలిత (30)గా గుర్తించారు. 
 
వివరాల ప్రకారం.. లలిత, ఆమె భర్త మాలోత్ ప్రభాకర్ మంగళవారం మోపాల్ గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. మోపాల్ నుంచి యాచారంలోని తమ ఇంటికి కారులో తిరిగి వస్తున్నారు.
 
వీరి కారు ఎల్లమ్మకుంట-అమ్రాబాద్ మధ్య అటవీ ప్రాంతానికి చేరుకోగానే.. రోడ్డుపై చిరుత పులిని గమనించిన ప్రభాకర్ ఒక్కసారిగా బ్రేకులు వేశాడు. కారు వేగంగా రావడంతో రోడ్డు పక్కనే ఉన్న బండరాయిని ఢీకొని బోల్తా పడింది. 
 
దీంతో మాలోత్ లలిత అక్కడికక్కడే మృతి చెందగా, ప్రభాకర్ తలకు గాయమైంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు క్షతగాత్రులను నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments