Webdunia - Bharat's app for daily news and videos

Install App

30 ఏళ్ల వయస్సులోనే ఆమెపై 12 కేసులు.. రూ.58.75 లక్షలు మోసం

సెల్వి
బుధవారం, 16 అక్టోబరు 2024 (23:01 IST)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో 12 కేసుల్లో ఉద్యోగ అవకాశాల పేరిట మోసం చేసిన 30 ఏళ్ల మహిళను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. కాగ్నిజెంట్, ఐబీఎం వంటి బహుళ-జాతీయ సంస్థలలో ఉద్యోగాలు ఇప్పిస్తానని అనేక మంది వ్యక్తులను మోసం చేసింది.
 
రేష్మా అనే నిందితురాలు, తన మాజీ భర్త మహమ్మద్ అలీ, మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి నకిలీ సిమ్ కార్డులను కొనుగోలు చేసి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) రంగంలో ఉద్యోగం కోసం సంప్రదించే వ్యక్తులను మోసం చేశారు.  
 
ఈ క్రమంలో హైదరాబాద్‌లోని మియాపూర్‌లో నివసిస్తున్న 34 ఏళ్ల ఎంబీఏ గ్రాడ్యుయేట్ వనజను కాగ్నిజెంట్‌లో సీనియర్ హ్యూమన్ రిసోర్సెస్ (హెచ్‌ఆర్) మేనేజర్‌గా నటిస్తూ రేష్మా మోసం చేసింది. ఆ సమయంలో తన ముగ్గురు స్నేహితులు ఉద్యోగాల కోసం వెతుకుతున్నారని వనజ పేర్కొన్న తర్వాత, రేష్మ ఆమెను సుప్రీతి అనే మరో కాగ్నిజెంట్ ఉద్యోగి వద్దకు రెఫర్ చేసింది. 
 
అయితే మొత్తం డ్రామా సక్సెస్ అయ్యాక వనజలా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారి వద్ద  మొత్తం రూ.58.75 లక్షలు మోసం చేసింది. ఇలా లక్షల రూపాయలను మోసం చేసిన ఈ గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి., భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) సెక్షన్ 66D కింద, సెక్షన్ 420, 467 (ఫోర్జరీ), 468 (మోసం కోసం ఫోర్జరీ) కేసుల కింద కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

ఆనంది, వరలక్ష్మిశరత్‌కుమార్ థ్రిల్లర్ శివంగి ఆహా లో స్ట్రీమింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments