Webdunia - Bharat's app for daily news and videos

Install App

30 ఏళ్ల వయస్సులోనే ఆమెపై 12 కేసులు.. రూ.58.75 లక్షలు మోసం

సెల్వి
బుధవారం, 16 అక్టోబరు 2024 (23:01 IST)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో 12 కేసుల్లో ఉద్యోగ అవకాశాల పేరిట మోసం చేసిన 30 ఏళ్ల మహిళను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. కాగ్నిజెంట్, ఐబీఎం వంటి బహుళ-జాతీయ సంస్థలలో ఉద్యోగాలు ఇప్పిస్తానని అనేక మంది వ్యక్తులను మోసం చేసింది.
 
రేష్మా అనే నిందితురాలు, తన మాజీ భర్త మహమ్మద్ అలీ, మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి నకిలీ సిమ్ కార్డులను కొనుగోలు చేసి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) రంగంలో ఉద్యోగం కోసం సంప్రదించే వ్యక్తులను మోసం చేశారు.  
 
ఈ క్రమంలో హైదరాబాద్‌లోని మియాపూర్‌లో నివసిస్తున్న 34 ఏళ్ల ఎంబీఏ గ్రాడ్యుయేట్ వనజను కాగ్నిజెంట్‌లో సీనియర్ హ్యూమన్ రిసోర్సెస్ (హెచ్‌ఆర్) మేనేజర్‌గా నటిస్తూ రేష్మా మోసం చేసింది. ఆ సమయంలో తన ముగ్గురు స్నేహితులు ఉద్యోగాల కోసం వెతుకుతున్నారని వనజ పేర్కొన్న తర్వాత, రేష్మ ఆమెను సుప్రీతి అనే మరో కాగ్నిజెంట్ ఉద్యోగి వద్దకు రెఫర్ చేసింది. 
 
అయితే మొత్తం డ్రామా సక్సెస్ అయ్యాక వనజలా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారి వద్ద  మొత్తం రూ.58.75 లక్షలు మోసం చేసింది. ఇలా లక్షల రూపాయలను మోసం చేసిన ఈ గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి., భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) సెక్షన్ 66D కింద, సెక్షన్ 420, 467 (ఫోర్జరీ), 468 (మోసం కోసం ఫోర్జరీ) కేసుల కింద కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments