Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్యాయాలు జరుగుతుంటే 'దేవుడెందుకు రావట్లేదు' ... సివిల్స్ ర్యాంకర్ యువతికి ఎదురైన ప్రశ్న!

ఠాగూర్
సోమవారం, 28 ఏప్రియల్ 2025 (09:23 IST)
సమాజంలో అనేక అన్యాయాలు, అక్రమాలు జరుగుతుంటే దేవుడు ఎందుకు రావడం లేదంటూ సివిల్స్ ఇంటర్వ్యూలకు హాజరైన ఓ యువతికి ఇంటర్వ్యూ బోర్డు సభ్యుల నుంచి ఎదురైంది. ఈ ప్రశ్నకు ఆమె ఎంతో సమయస్ఫూర్తిగా సమాధానమిచ్చి బోర్డు సభ్యులను మెప్పించారు. పైగా, సివిల్స్ సర్వీసెస్ ఫలితాల్లో 11వ ర్యాంకు సాధించి, రెండు తెలుగు రాష్ట్రాలకే గర్వకారణంగా నిలిచింది. 
 
తెలుగు రాష్ట్రాల్లో సివిల్స్ టాపర్‌గా నిలిచారు. పేరు ఇట్టబోయిన సాయి శివానీ. వరంగల్ యువతి. సివిల్స్ ఇంటర్వ్యూలో బోర్డు సభ్యులు ఆమెకు ఓ ప్రశ్న సంధించారు. 'భగవద్గీతలో "సంభవామి యుగేయుగే" అని శ్రీకృష్ణుడు చెప్పారు కదా.. మరి ప్రస్తుత సమాజంలో ఇన్ని అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నా దేవుడు ఎందుకు రావడం లేదు' అని ఇంటర్వ్యూ బోర్డు సభ్యులు ప్రశ్నించారు.
 
ఈ ప్రశ్నకు సాయి శివానీ సమాధానమిస్తూ, సమాజంలో ఉన్న ప్రతి మనిషిలోనూ ఎంతో కొంత మంచితనం ఉంటుంది. అవసరమైన వారికి సరైన సమయంలో సహాయం చేస్తే, ఆ సహాయం చేసేవారే దేవుడుతో సమానం. దేవుడు ప్రత్యేకంగా ఎక్కడి నుంచో రానక్కర్లేద. సహాయం చేసే ప్రతి ఒక్కరూ దేవుడుతో సమానమే అంటూ సమయస్ఫూర్తిగా సమాధానమిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments