తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ గ్రూపు-2 పరీక్షలు వాయిదా!

Webdunia
మంగళవారం, 26 డిశెంబరు 2023 (12:34 IST)
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించాల్సిన గ్రూపు-2 పరీక్షలు మళ్లీ వాయిదాపడ్డాయి. చైర్మన్‌తో సహా ఐదుగురు టీఎస్ పీఎస్సీ సభ్యులు రాజీనామాల విషయం ఎటూ తేలకపోవడంతో ఈ పరీక్షల నిర్వహణపై గందరగోళం నెలకొంది. దీంతో ఇపుడు మరోమారు వాయిదాపడ్డాయి. ఇప్పటికే రెండుసార్లు వాయిదాపడిన విషయం తెల్సిందే. 
 
నిజానికి ఈ నెల 6, 7 తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహించాల్సివుంది. ఈ తేదీలను రెండు నెలల క్రితమే ప్రకటించారు. కానీ, ఈ పరీక్షల నిర్వహణకు మరో వారం పదిరోజుల సమయం మాత్రమే ఉన్నప్పటికీ పరీక్షల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు జరగలేదు. దీంతో ఈ పరీక్షలు వాయిదా వేసినట్టేనని అభ్యర్థులు పేర్కొంటున్నారు.
 
కాగా, రాష్ట్రంలోని వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న 783 పోస్టుల భర్తీకి టీఎస్ పీఎస్సీ గతేడాది డిసెంబరు నెలలో నోటిఫికేషన్ జారీ చేసింది. సుమారు 5.5 లక్షల మంది నిరుద్యోగులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. ఆగస్టులో పరీక్షలు నిర్వహించనున్నట్లు కమిషన్ తొలుత ప్రకటించింది. ఆపై నవంబరుకు, మళ్లీ 2024 జనవరి నెలకి వాయిదా వేసింది. ఇప్పుడు మళ్లీ వాయిదా పడే అవకాశం ఉండడంతో గ్రూప్ 2 పరీక్షలను రీషెడ్యూల్ చేస్తారా లేక రీవైజ్డ్ నోటిఫికేషన్ జారీ చేస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏవీఎం శరవణన్ భౌతికకాయానిక నివాళులు.. సూర్య కంటతడి

నా నుంచి ఎలాంటి బ్రేకింగ్ న్యూస్‌లు ఆశించకండి : రాజ్ నిడిమోరు మాజీ భార్య

Nayanatara: చిరంజీవి, నయనతార లపై రెండవ సింగిల్ శశిరేఖ లిరికల్ రాబోతుంది

Allu Arjun : కున్రిన్ పేరుతో జపనీస్ థియేటర్లలోకి అల్లు అర్జున్... పుష్ప 2

Arnold : అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీమియర్‌ చూసి అర్నాల్డ్ ష్వార్జెనెగర్ ప్రశంస

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments