Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ గ్రూపు-2 పరీక్షలు వాయిదా!

Webdunia
మంగళవారం, 26 డిశెంబరు 2023 (12:34 IST)
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించాల్సిన గ్రూపు-2 పరీక్షలు మళ్లీ వాయిదాపడ్డాయి. చైర్మన్‌తో సహా ఐదుగురు టీఎస్ పీఎస్సీ సభ్యులు రాజీనామాల విషయం ఎటూ తేలకపోవడంతో ఈ పరీక్షల నిర్వహణపై గందరగోళం నెలకొంది. దీంతో ఇపుడు మరోమారు వాయిదాపడ్డాయి. ఇప్పటికే రెండుసార్లు వాయిదాపడిన విషయం తెల్సిందే. 
 
నిజానికి ఈ నెల 6, 7 తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహించాల్సివుంది. ఈ తేదీలను రెండు నెలల క్రితమే ప్రకటించారు. కానీ, ఈ పరీక్షల నిర్వహణకు మరో వారం పదిరోజుల సమయం మాత్రమే ఉన్నప్పటికీ పరీక్షల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు జరగలేదు. దీంతో ఈ పరీక్షలు వాయిదా వేసినట్టేనని అభ్యర్థులు పేర్కొంటున్నారు.
 
కాగా, రాష్ట్రంలోని వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న 783 పోస్టుల భర్తీకి టీఎస్ పీఎస్సీ గతేడాది డిసెంబరు నెలలో నోటిఫికేషన్ జారీ చేసింది. సుమారు 5.5 లక్షల మంది నిరుద్యోగులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. ఆగస్టులో పరీక్షలు నిర్వహించనున్నట్లు కమిషన్ తొలుత ప్రకటించింది. ఆపై నవంబరుకు, మళ్లీ 2024 జనవరి నెలకి వాయిదా వేసింది. ఇప్పుడు మళ్లీ వాయిదా పడే అవకాశం ఉండడంతో గ్రూప్ 2 పరీక్షలను రీషెడ్యూల్ చేస్తారా లేక రీవైజ్డ్ నోటిఫికేషన్ జారీ చేస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments