Webdunia - Bharat's app for daily news and videos

Install App

వడగళ్ల వాన, పిడుగులు.. వరంగల్‌లో ఇద్దరు రైతుల మృతి

సెల్వి
సోమవారం, 6 మే 2024 (10:50 IST)
వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో తీవ్ర వేడిమితో అల్లాడుతున్న ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే వడగళ్ల వాన, పిడుగులు ఊహించని నష్టాన్ని మిగిల్చాయి. వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఒకే రోజు పిడుగుపాటుకు ఇద్దరు రైతులు ప్రాణాలు కోల్పోయారు. 
 
ఆదివారం రాత్రి కురిసిన వడగళ్ల వాన ఊహించని నష్టాన్ని మిగిల్చింది. మిర్చి, వరి, బొప్పాయి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 
 
చేతికి అందిన పంట నీటమునిగిందని రైతులు విలపిస్తున్నారు. పంటలను కాపాడుకునే క్రమంలో వేర్వేరు ప్రాంతాల్లో పిడుగుపాటుకు ఇద్దరు రైతులు మృతి చెందారు.
 
ములుగు జిల్లా ఏటూరు నాగారంలో పిడుగుపాటుకు బుల్లయ్య అనే రైతు మృతి చెందాడు. ఎండు మిరపకాయలు తడవకుండా పాల్టిన్ కవర్‌తో కప్పుతుండగా మరో రైతు పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. 
 
రఘునాథపల్లి మండలం కోడూరు గ్రామంలో దాసరి అజయ్ (25) అనే రైతు పొలంలో పిడుగుపడి మృతి చెందాడు. రైతుతో పాటు ఆవు, దూడ కూడా పిడుగుపాటుకు గురయ్యాయి. 
 
వాజేడు మండలం బొల్లారంలో పిడుగుపాటుకు గుడిసె ధ్వంసమైంది. ఆ గుడిసెలో నివసిస్తున్న కుటుంబం తీవ్ర గాయాలతో బయటపడింది. వీరిని వెంకటాపురం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments