Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డు ప్రమాదం కేసు : బుల్లితెర నటుడు లోబోకు జైలుశిక్ష

ఠాగూర్
శుక్రవారం, 29 ఆగస్టు 2025 (08:48 IST)
గత 2018లో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో బుల్లితెర నటుడు ఖయూమ్ అలియాస్ లోబోకు కోర్టు ఒక యేడాది పాటు జైలుశిక్ష విధించింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయాలపాలయ్యారు. ఈ కేసులో ఆయనకు తెలంగాణ రాష్ట్రంలోని జనగామ కోర్టు ఒక యేడాది జైలుశిక్ష విధిస్తూ తాజాగా తీర్పునిచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, గత 2018 మే 21వ తేదీన టీవీ చానల్ తరపున వీడియో చిత్రీకరణ కోసం లోబో బృందం వేయిస్తంభాల గుడి, భద్రకాళి చెరువు, రామప్ప, లక్నవరం తదితర ప్రాంతాల్లో పర్యటించింది. 
 
ఈ క్రమంలో లోబో బృందం వరంగల్ నుంచి హైదరాబాద్ నగరానికి వస్తున్న సమయంలో రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద లోబో డ్రైవ్ చేస్తున్న కారు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలోని మేడె కుమార్, పెంబర్తి మణెమ్మలు తీవ్ర గాయాలతో చనిపోయారు. కారు కూడా బోల్తా పడటంతో లోతోబోపాటు అందులోని బృందం సభ్యులకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. 
 
ఈ ప్రమాదంపై మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అప్పట్లో రఘునాథపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరి మృతికి కారణమైన లోబోకు యేడాది జైలుశిక్షతో పాటు రూ.12500 అపరాధం విధిస్తూ జనగామ కోర్టు తాజాగా తీర్పునిచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kantara Sequel: కాంతారా చాప్టర్ వన్‌కు కేరళతో వచ్చిన కష్టాలు.. సమస్య పరిష్కరించకపోతే..?

Bellam konda: దెయ్యాలుండే హౌస్ లో కిష్కింధపురి షూటింగ్ చేశాం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Ritika Nayak : సెట్ లో బ్రదర్ సిస్టర్ అని పిలుచుకునే వాళ్లం : రితికా నాయక్

సామాన్యుడి గేమ్ షో గా రానున్న ది లక్ - గెలిచిన వారికి కారు బహుమానం

Samyukta Menon: అందం, ఆరోగ్యం ఒకరిని అనుకరించడం కరెక్ట్ కాదు: సంయుక్త మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

తర్వాతి కథనం
Show comments