Webdunia - Bharat's app for daily news and videos

Install App

28 నుంచి తెలంగాణాలో ఇంటర్ పరీక్షలు - నిమిషం ఆలస్యమైనా...

వరుణ్
సోమవారం, 26 ఫిబ్రవరి 2024 (15:29 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 28వ తేదీ బుధవారం నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షల వివరాలను ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి సోమవారం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 1521 సెంటర్లను ఈ పరీక్ష కోసం ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 75 ఫ్లయింగ్ స్క్వాడ్, 200 మంది సిట్టింగ్ స్క్వాడ్, 27,900 మంది ఇన్విజిలేటర్లు ఈ పరీక్షల నిర్వహణ విధుల్లో పాల్గొంటారని తెలిపారు. ఇంటర్ ఫస్ట్, ద్వితీయ సంవత్సర పరీక్షలకు మొత్తం 980978 మంది విద్యార్థులు హాజరవుతున్నారని చెప్పారు. 
 
ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్ష జరుగుతుందన్నారు. ఈ పరీక్షకు వచ్చే విద్యార్థులు ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా హాల్‌లోకి అనుమతించబోమని చెప్పారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను కోరినట్టు చెప్పారు. పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. విద్యార్థులు మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకునిరాకూడదని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో నీరు, వైద్య, సదుపాయాలు ఉంటాయని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

మరో నెలలో ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ - గెలాక్టస్‌తో యుద్ధానికి సిద్ధం

War 2 : IMAXలో మాత్రమే వార్ 2 విడుదల అవుతుంది

Laya: ఆ తపనతో తిరిగి వచ్చా - ఇండస్ట్రీలో మార్పులు వచ్చాయి - శివాజీతో సినిమా : నటి లయ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments