Webdunia - Bharat's app for daily news and videos

Install App

28 నుంచి తెలంగాణాలో ఇంటర్ పరీక్షలు - నిమిషం ఆలస్యమైనా...

వరుణ్
సోమవారం, 26 ఫిబ్రవరి 2024 (15:29 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 28వ తేదీ బుధవారం నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షల వివరాలను ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి సోమవారం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 1521 సెంటర్లను ఈ పరీక్ష కోసం ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 75 ఫ్లయింగ్ స్క్వాడ్, 200 మంది సిట్టింగ్ స్క్వాడ్, 27,900 మంది ఇన్విజిలేటర్లు ఈ పరీక్షల నిర్వహణ విధుల్లో పాల్గొంటారని తెలిపారు. ఇంటర్ ఫస్ట్, ద్వితీయ సంవత్సర పరీక్షలకు మొత్తం 980978 మంది విద్యార్థులు హాజరవుతున్నారని చెప్పారు. 
 
ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్ష జరుగుతుందన్నారు. ఈ పరీక్షకు వచ్చే విద్యార్థులు ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా హాల్‌లోకి అనుమతించబోమని చెప్పారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను కోరినట్టు చెప్పారు. పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. విద్యార్థులు మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకునిరాకూడదని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో నీరు, వైద్య, సదుపాయాలు ఉంటాయని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: అల్లు అర్జున్ సినిమా కోసం రెక్కీ చేస్తున్న దర్శకుడు అట్లీ

4 రోజుల్లో 15.41 కోట్ల గ్రాస్ వసూళ్లు దక్కించుకున్న లిటిల్ హార్ట్స్

Siddhu: సిద్ధు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా తెలుసు కదా విడుదల తేదీ ఫిక్స్

గత ఏడాది డిసప్పాయింట్ చేసింది, విఎఫ్ఎక్స్ ఇన్ హౌస్ లో చేయడంతో కంట్రోల్ వుంది : టిజి విశ్వప్రసాద్

Roshan: రోషన్ ఛాంపియన్‌లో మలయాళ నటి అనస్వర రాజన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

ఫిలడెల్ఫియా నాట్స్ అక్షయపాత్ర ఆధ్వర్యంలో గణేశ్ మహా ప్రసాదం

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

తర్వాతి కథనం
Show comments