24వ తేదీన ఇంటర్, 30న పది పరీక్షా ఫలితాలు.. క్లారిటీ ఇచ్చిన తెలంగాణ విద్యాశాఖ!!

వరుణ్
ఆదివారం, 21 ఏప్రియల్ 2024 (09:31 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్, పదో తరగతి పరీక్షా ఫలితాలు ఈ నెల 24వ తేదీన విడుదలకానున్నాయి. ఈ మేరకు ఆ రాష్ట్ర విద్యాశాఖ ఓ స్పష్టత ఇచ్చింది. ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలను ఈ నెల 24వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని విద్యాశాఖ ప్రకటించింది. ఈ యేడాది ఇంటర్ పబ్లిక్ పరీక్షలను గత ఫిబ్రవరి 28న నుంచి మార్చి 19వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెల్సిందే. రెండు సంవత్సరాలకు కలిపి 9,80,978 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మార్చి 10 నుంచి ఈనెల 10 తేదీల మధ్య మూల్యాంకనాన్ని పూర్తి చేశారు.
 
గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం 15 రోజుల ముందుగానే ఫలితాలు ప్రకటించబోతున్నారు. 2023లో మే 9వ తేదీన ఫలితాలను వెల్లడించారు. ఈసారి మార్కుల నమోదులో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు. జవాబు పత్రాలను మూడుసార్లు పరిశీలించారు. కోడింగ్, డీకోడింగ్ ప్రక్రియలను జాగ్రత్తగా పూర్తిచేశారు.
 
అలాగే తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షా ఫలితాల విడుదలపై కూడా విద్యాశాఖ కసరత్తులు చేస్తోంది. ఈ నెల 30 లేదా మే 1వ తేదీన ఫలితాలు వెల్లడించాలని విద్యాశాఖ యోచిస్తోంది. ఇంటర్, పదో తరగతి పరీక్ష ఫలితాల విడుదలకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో మంత్రులు కాకుండా విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేయనున్నారు. కాగా పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగాయి. 5,08,385 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మూల్యాంకనం శనివారం పూర్తయింది. డీకోడింగ్ అనంతరం ఫలితాలు వెల్లడించానున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments