Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ నగరంలో గోడకూలి ఏడుగురు మృత్యువాత!!

ఠాగూర్
బుధవారం, 8 మే 2024 (08:23 IST)
హైదరాబాద్ నగరంలో గోడకూలి ఏడుగురు మృత్యువాతపడ్డారు. సోమవారం నుంచి రాత్రి హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షం కురిసింది. ఈ వర్షం తీవ్ర విషాదాన్ని నింపింది. వర్షం ప్రభావంతో బాచుపల్లిలో గోడకూలి ఏకంగా ఏడుగురు చనిపోయారు. బాచుపల్లిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో ఈ విషాదం చోటుచేసుకుంది. 
 
మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి గోడకూలిపోయింది. ఈ శిథిలాల కింద ఏడుగురు మృతదేహాలను స్థానికులు గుర్తించి అధికారులకు సమాచారమిచ్చారు. మృతులను రామ్ యాదవ్, గీత, హిమాన్షు, తిరుపతిరావు, శంకర్, రాజు, ఖుషిగా గుర్తించారు. 
 
కాగా, గోడ కూలిందన్న సమాచారం అందుకున్న అధికారులు మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలను తొలగించి మొత్తం ఏడుగు మృతదేహాలను వెలికితీశారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. 
 
కాగా మండుటెండల నేపథ్యంలో మంగళవారం కురిసిన భారీ వర్షం నగరవాసులకు కాస్త ఉపశమనం కలిగించింది. అయితే, పలుచోట్ల నాలాలు పొంగడం, ట్రాఫిక్, విద్యుత్ అంతరాయం వంటి సమస్యలు ఎదురయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments