Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ నగరంలో గోడకూలి ఏడుగురు మృత్యువాత!!

ఠాగూర్
బుధవారం, 8 మే 2024 (08:23 IST)
హైదరాబాద్ నగరంలో గోడకూలి ఏడుగురు మృత్యువాతపడ్డారు. సోమవారం నుంచి రాత్రి హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షం కురిసింది. ఈ వర్షం తీవ్ర విషాదాన్ని నింపింది. వర్షం ప్రభావంతో బాచుపల్లిలో గోడకూలి ఏకంగా ఏడుగురు చనిపోయారు. బాచుపల్లిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో ఈ విషాదం చోటుచేసుకుంది. 
 
మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి గోడకూలిపోయింది. ఈ శిథిలాల కింద ఏడుగురు మృతదేహాలను స్థానికులు గుర్తించి అధికారులకు సమాచారమిచ్చారు. మృతులను రామ్ యాదవ్, గీత, హిమాన్షు, తిరుపతిరావు, శంకర్, రాజు, ఖుషిగా గుర్తించారు. 
 
కాగా, గోడ కూలిందన్న సమాచారం అందుకున్న అధికారులు మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలను తొలగించి మొత్తం ఏడుగు మృతదేహాలను వెలికితీశారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. 
 
కాగా మండుటెండల నేపథ్యంలో మంగళవారం కురిసిన భారీ వర్షం నగరవాసులకు కాస్త ఉపశమనం కలిగించింది. అయితే, పలుచోట్ల నాలాలు పొంగడం, ట్రాఫిక్, విద్యుత్ అంతరాయం వంటి సమస్యలు ఎదురయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: ఎన్టీఆర్, నాగార్జునల భిన్నమైన పాత్రలకు తొలి అడుగులు సక్సెస్ సాధిస్తాయా?

చిత్రపురి కార్మిలకు మోసం చేసిన వల్లభనేని అనిల్‌ కు మంత్రులు, అధికారులు అండ ?

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments