ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

ఠాగూర్
సోమవారం, 23 డిశెంబరు 2024 (19:23 IST)
'పుష్ప-2' చిత్రం ప్రీమియర్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటరులో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర అస్వస్థకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన ఇపుడు పెనువివాదానికి దారితీసింది. ఈ తొక్కిసలాట ఘటనకు హీరో అల్లు అర్జున్ కారణమంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేయగా ఈ వ్యాఖ్యలను హీరో అల్లు అర్జున్ ఖండించారు. 
 
ఈ అంశంపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘాటుగా స్పందించారు. ఐకాన్ స్టార్‌కు ప్రత్యేక రాజ్యాంగం ఉంటదా? అని ప్రశ్నించారు. ఐకాన్ స్టార్ అయితే ఎవరిని చంపినా ఫర్వలేదా? అని సూటిగా అడిగారు. ప్రధానమంత్రి అయినా సర్పంచ్ అయినా ఐకాన్ స్టార్ అయినా అందరికీ ఒకటే చట్టం అని అన్నారు. 
 
చిత్రపరిశ్రమకు చెందిన హీరోల్లో అనేక మంది స్మార్ట్‌గా తయారైన అల్లు అర్జున్‌ను పరామర్శించారు కానీ ఆసుపత్రికి మాత్రం రాలేదన్నారు. జింకను చంపిన కేసులో ఇంటర్నేషనల్ స్టార్ సల్మాన్ ఖానే 14 ఏళ్ల పాటు కోర్టుల చుట్టూ తిరిగారని గుర్తు చేశారు. విలేకరుల సమావేశం పెట్టి తనను, సీఎంను అలా అనడం కరెక్ట్ కాదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments