Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్తి కోసం భర్త అంత్యక్రియలను అడ్డుకున్న భార్య (Video)

ఠాగూర్
మంగళవారం, 10 సెప్టెంబరు 2024 (17:26 IST)
అనారోగ్యంతో చనిపోయిన భర్త అంత్యక్రియలను తన బిడ్డతో కలిసి భార్య అడ్డుకుంది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి - మంథని మండలం విలోచవరం గ్రామంలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన సునీల్ (36)కు నాలుగేళ్ల కింద సంధ్య అనే మహిళతో వివాహమైంది. వీరికి ఓ బాబు ఉన్నాడు. 
 
అయితే, భార్యాభర్తల మధ్య గొడవలు తలెత్తడంతో యేడాది నుంచి ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమలో సునీల్ అనారోగ్యంతో మంచానపడ్డారు. ఆయన మూడు రోజుల క్రితం హైదరాబాద్ నగరంలో చనిపోయాడు. అంత్యక్రియలను మంథనిలోని గోదావరి ఒడ్డున నిర్వహించేందుకు మృతదేహాన్ని తీసుకొచ్చారు. 
 
ఈ విషయం తెలుసుకున్న సంధ్య తన బిడ్డతో సహా వెళ్లి తన భర్త ఆస్తి తనకు ఇవ్వాలంటూ సునీల్ కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగి అంత్యక్రియలు జరగకుండా అడ్డుకున్నారు. సునీల్ ఆస్తిలో తన కుమారుడికి వాటా ఇవ్వాలని పట్టుబట్టింది. అయితే, సునీల్ కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం చేరవేయడంతో వారు వచ్చి అంత్యక్రియలు పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments