Webdunia - Bharat's app for daily news and videos

Install App

26 నుంచి తెలంగాణాలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ

ఠాగూర్
శుక్రవారం, 17 జనవరి 2025 (13:27 IST)
తెలంగాణా రాష్ట్రంలో కొత్తగా రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో కొత్త రేషన్ కార్డుల జారీ కోసం అర్హులైన వారిని గుర్తించేందుకు బల్దియా కమిషనర్ ఇలంబర్తి ఆధ్వర్యంలో అధికారుల బృందం రంగంలోకి దిగింది. 
 
గ్రేటర్ బల్దియాలోని 150 డివిజన్లలో దరఖాస్తుదారులను పరిశీలించారు. ఈ నెల 24 నాటికి అర్హుల ఎంపికను పూర్తిచేసి, 25న నివేదికను ఆయా జిల్లా కలెక్టర్లకు ఇవ్వాలని జీహెచ్ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది. అర్హులను ప్రభుత్వం వద్దనున్న సమాచారంతో సరిచూసి, 26 నుంచి కొత్త కార్డులను జారీ చేయనున్నట్టు సమాచారం.
 
ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం సమగ్ర సర్వే చేపట్టింది. గ్రేటర్ 22 లక్షల కుటుంబాల వివరాలను నమోదు చేసింది. అందులో రేషన్ కార్డు లేదని, కొత్త కార్డు కావాలనే అభ్యర్థనలు అందాయి. పరిశీలన అనంతరం 83,285గా లెక్క తేల్చింది. ఇటీవల ఇంటింటి సర్వేలోనూ అనేక మంది రేషన్ కార్డులు లేనివారు వివరాలు నమోదు చేయించుకున్నారు. 
 
కొన్నేళ్లుగా కొత్తకార్డులు ఇవ్వకపోవడం, జన్మించిన శిశువులు, కొత్తగా వచ్చిన కోడళ్ల పేర్లను రేషన్ కార్డుల్లో చేర్చాలంటూ వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకునే అంశంపై రెండు రోజుల్లో ఆదేశాలు వెలువడవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం