Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోదాడలో ఘోరం.. ఆగివున్న కారును ఢీకొట్టిన కారు.. ఆరుగురు దుర్మరణం!!

వరుణ్
గురువారం, 25 ఏప్రియల్ 2024 (08:21 IST)
తెలంగాణ రాష్ట్రంలోని కోదాడలో ఘోరం జరిగింది. ఆగివున్న లారీని ఓ కారు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో మహిళ ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ఘోరం గురువారం తెల్లవారుజామున 65వ నంబరు జాతీయ రహదారిపై జరిగింది. 
 
హైదరాబాద్ నుంచి విజయవాడ వెళుతున్న కారు ఒకటి సూర్యాపేట జిల్లా కోదాడ శివారు ప్రాంతమైన దుర్గాపురం వద్ద రోడ్డు పక్కన ఆగివున్న లారీని ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. డ్రైవర్ నిద్ర, కారు అతివేగం కారణంగా ఈ ప్రమాదం జరిగివుంటుందని ప్రాథమికంగా భావిస్తున్నట్టు చెప్పారు. 
 
సమాచారం అందుకున్న వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

కల్కి 2898 AD నుంచి ప్రభాస్, దిల్జిత్ దోసాంజ్ 'భైరవ అంథమ్' రిలీజ్

షో రీల్ తో ఆకట్టుకున్న మిస్టర్ బచ్చన్

అంజలి బహిష్కరణ చేసింది ఎవరిని?

సినిమా రంగంలో సవాళ్లు నేపథ్యంగా ఇట్లు... మీ సినిమా

అనుపమ పరమేశ్వరన్ నటిసున్న పరదా లో దర్శన రాజేంద్రన్ పరిచయం

అసిడిటీ తగ్గించుకోవడానికి అద్భుతమైన చిట్కాలు

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

తర్వాతి కథనం
Show comments