Webdunia - Bharat's app for daily news and videos

Install App

హస్తప్రయోగం చేసి వీర్యాన్ని కుల్ఫీ - ఐస్ క్రీమ్‌లలో కలుపుతున్న రాజస్థాన్ వ్యాపారి.. అరెస్టు

ఠాగూర్
బుధవారం, 20 మార్చి 2024 (11:20 IST)
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో రోడ్డు పక్కన తోపుడుబండి వ్యాపారి పాడుపనికి పాల్పడ్డాడు. తాను చేసింది పాడుపని అని తెలిసినప్పటికీ పైగా, ఉద్దేశ్యపూర్వంగా చేశాడు. పైగా, తన వీర్యాన్ని ఐస్‌క్రీమ్, కుల్ఫీల్లో కలిపి విక్రయించాడు. అతని చర్యలన్నీ సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడం, వీటిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యాయి. దీంతో పోలీసులు స్పందించి ఆ వ్యాపారిని అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన కథనం వివరాలను పరిశీలిస్తే, 
 
వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో రోడ్డుపక్కన కుల్ఫీ, ఐస్‌క్రీం దుకాణం నడుపుతున్న ఓ వ్యక్తి హస్తప్రయోగం చేసుకుంటూ తన వీర్యాన్ని ఐస్‌క్రీం లేదా ఫలూడా పాత్రలో కలిపుతూ కనిపించాడు. ఉద్దేశ్యపూర్వకంగానే ఈ పనికి పాల్పడినట్టు తెలుస్తుంది. మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్‌లో ఆ వ్యక్తి ట్రే సైకిల్‌లో స్టాల్‌ నడుపుతున్నాడు. 
 
ఐస్‌క్రీం విక్రయదారుడిని రాజస్థాన్‌కు చెందిన కాలురామ్ కుర్బియాగా గుర్తించిన నెక్కొండ పోలీసులు అతనిపై ఐపిసి సెక్షన్ 294 కింద బహిరంగంగా అసభ్యకరమైన చర్యకు పాల్పడినందుకు కేసు నమోదు చేసినట్లు తమ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. విక్రేత యొక్క అవమానకరమైన చర్య కెమెరాలో రికార్డైంది. పైగా, దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది వైరల్ అయింది. దీంతో రంగంలోకి దిగిన ఫుడ్ ఇన్‌స్పెక్టర్ కృష్ణమూర్తి సహా ఫుడ్ సేఫ్టీ అధికారులు అతని నుంచి తినుబండరాల శాంపిల్స్‌ను సేకరించి పరీక్షలు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం